టీవీ యాంకర్ అన్నం వండింది – దెబ్బకి కుక్కర్ పేలింది..

చెన్నైలో పాపులర్ యాంకర్ మణిమేఘలై ఇంట్లో కుక్కర్ పేలింది..

  • Published By: sekhar ,Published On : February 21, 2020 / 05:32 AM IST
టీవీ యాంకర్ అన్నం వండింది – దెబ్బకి కుక్కర్ పేలింది..

చెన్నైలో పాపులర్ యాంకర్ మణిమేఘలై ఇంట్లో కుక్కర్ పేలింది..

అన్నానగర్‌ : చెన్నైలో పాపులర్ టీవీ యాంకర్‌ ఇంట్లో కుక్కర్‌ పేలింది. లక్కీగా ఆ టైమ్‌లో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తమిళనాట టెలివిజన్‌లో సూపర్‌ హిట్స్‌ అనే కార్యక్రమానికి యాంకరింగ్ చేయడంతో మణిమేఘలై ఫేమస్ అయింది. సన్ మ్యూజిక్, విజయ్ టీవీ వంటి చానల్స్‌లో ఆమె పలు కార్యక్రమాలు చేసింది.

2017లో యాక్టింగ్ ట్రైనర్ హుసైన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొద్దికాలంగా ఈ జంట అన్నానగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. తాజాగా మణిమేఘలై ఇంట్లో వంట చేసే వ్యక్తి రాకపోవడంతో కుక్కర్‌లో మణిమేఘలై స్వయంపాకం మొదలుపెట్టింది. తన ప్రయోగం ఎలా ఉంటుందో కాసేపట్లో రుచి చూద్దామనుకుంటుండగా ఇంతలో కుక్కర్‌ విజిల్‌ రాకుండా పేలిపోయింది.

సడెన్‌గా పెద్ద శబ్ధం రావడంతో మణిమేఘలై ఉలిక్కిపడింది. ఆ ధాటికి వస్తువులన్నీ చెల్లాచెదురుకావడంతో వంట గది నాశనమైంది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియో మణిమేఘలై తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కుక్కర్‌ సమీపంలో ఎవరూ లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పిందని తెలిపింది మణిమేఘలై. 

Read More>>రైలు ప్రయాణికులకు శుభవార్త….కావాల్సినన్ని తత్కాల్ టికెట్లు