చొక్కా మీద చొక్కా కాదు.. మాస్క్ మీద మాస్కే ట్రెండ్.. మహేష్ బాబును వాడేసిన పోలీసులు..
Cyberabad Police:తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ నిర్ణయంతో.. బయటకు రావాలంటే ఆలోచించుకోండి.. రూల్స్ బ్రేక్ చేస్తే రంగుపడుద్ది అంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే.. ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయడంలో ముందుండే సైబరాబాద్ పోలీసులు.. మహేష్బాబును వాడేసి ఫోటోలతో ఓ పోస్ట్ చేశారు.
డెనిమ్ జీన్స్, జాకెట్ వేసుకున్న మహేష్బాబు ఫోటోను పోస్ట్ చేసిన పోలీసులు..’డెనిమ్ మీద డెనిమ్ ఫ్యాషన్ ట్రెండ్, మాస్క్ మీద మాస్క్ సేఫ్టీ ట్రెండ్’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయం ఏదైనా సరికొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తారంటూ నెటిజన్లు సైబరాబాద్ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Safety First..#WearAMask #StaySafe #IndiaFightsCorona#Unite2FightCorona @urstrulyMahesh @MaheshBabu_FC @TelanganaCOPs pic.twitter.com/jNvP6XW0PS
— Cyberabad Police (@cyberabadpolice) May 11, 2021
ఈ క్రమంలోనే లేటెస్ట్గా అడుగు బయట పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి! నిత్యావసరాలకు లేదా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. అదీ కుటుంబానికి ఒకరే, తగిన జాగ్రత్తలు పాటిస్తూ… మాస్క్_ధరించండి.. భౌతికదూరం పాటించండి. అంటూ పోస్ట్ చేస్తూ అవగాహన కల్పించారు పోలీసులు.
అడుగు బయట పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి!
నిత్యావసరాలకు లేదా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.
అదీ కుటుంబానికి ఒకరే, తగిన జాగ్రత్తలు పాటిస్తూ… #మాస్క్_ధరించండి #భౌతికదూరంపాటించండి. pic.twitter.com/ROiIacV4Ol— Telangana State Police (@TelanganaCOPs) May 12, 2021