Godfather: గాడ్‌ఫాదర్ క్లైమాక్స్.. టాలీవుడ్, బాలీవుడ్ షేక్ అవ్వాల్సిందే..!

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘గాడ్‌ఫాదర్’ మూవీ దసరా పండగకు థియేటర్లలో ల్యాండ్ అవుతోంది. ఇప్పటికే అన్ని పనులు ముగించుకున్న ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి మరోసారి అదిరిపోయే సక్సెస్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలోని క్లైమాక్స్ వేరే లెవెల్‌లో ఉందని.. ఇది అభిమానులతో పాటు ప్రేక్షకులను ఖచ్చితంగా మెస్మరైజ్ చేస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Godfather: గాడ్‌ఫాదర్ క్లైమాక్స్.. టాలీవుడ్, బాలీవుడ్ షేక్ అవ్వాల్సిందే..!

Godfather Climax To Give Goosebumps To Fans

Godfather: మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘గాడ్‌ఫాదర్’ మూవీ దసరా పండగకు థియేటర్లలో ల్యాండ్ అవుతోంది. ఇప్పటికే అన్ని పనులు ముగించుకున్న ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి మరోసారి అదిరిపోయే సక్సెస్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని మెగాస్టార్ గట్టిగానే ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Godfather: గాడ్‌ఫాదర్ సెన్సార్ రిపోర్ట్.. ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్ ఖాయం!

కాగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో గాడ్‌ఫాదర్ చిత్రంపై మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలోని క్లైమాక్స్ వేరే లెవెల్‌లో ఉందని.. ఇది అభిమానులతో పాటు ప్రేక్షకులను ఖచ్చితంగా మెస్మరైజ్ చేస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్తుందని.. ఇప్పటివరకు ఇలాంటి క్లైమాక్స్‌ను ఆడియెన్స్ ఈమధ్య కాలంలో చూసి ఉండరని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ క్లైమాక్స్‌లో చిరంజీవితో పాటు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌లను దర్శకుడు ఎలివేట్ చేసే విధానం సూపర్బ్‌గా ఉంటుందని.. వారిద్దరు కలిసి చేసే యాక్షన్ సీన్స్‌కు టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలు షేక్ అవ్వాల్సిందే అని చిత్ర యూనిట్ అంటోంది.

Godfather: రీ-షూట్ జరుపుకుంటున్న గాడ్ ఫాదర్.. ముంబైలో చిత్ర యూనిట్!

మొత్తానికి గాడ్‌ఫాదర్ చిత్రంపై రోజురోజుకూ అంచనాలను పెంచేస్తుండటంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో చిరుతో పాటు స్టార్ బ్యూటీ నయనతార, వర్సెటైల్ యాక్టర్ సత్యదేవ్, పూరీ జగన్నాధ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం మరో మేజర్ అసెట్‌గా మారనుంది. ఈ సినిమా మెగా ఫ్యాన్స్‌కు నిజమైన పండగను తీసుకొస్తుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా చెబుతోంది.