పెళ్లి పేరుతో మోసం చేశాడు.. సాయి సుధ ఫిర్యాదు.. పోలీసు కస్టడీలో శ్యామ్ కె నాయుడు..

ప్రముఖ కెమెరామెన్ శ్యామ్ కె నాయుడిపై సాయి సుధ ఫిర్యాదు..

  • Published By: sekhar ,Published On : May 27, 2020 / 10:06 AM IST
పెళ్లి పేరుతో మోసం చేశాడు.. సాయి సుధ ఫిర్యాదు.. పోలీసు కస్టడీలో శ్యామ్ కె నాయుడు..

ప్రముఖ కెమెరామెన్ శ్యామ్ కె నాయుడిపై సాయి సుధ ఫిర్యాదు..

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు తమ్ముడు శ్యామ్ కే నాయుడు తనను మోసం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ సాయి సుధ ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘శ్యామ్‌తో నాకు ఐదేళ్లుగా పరిచయం ఉంది, 2015 నుంచి మేం సహజీవనం చేస్తున్నాం. మొదట్లోనే నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు..

 అందుకు సంబంధించిన వాయిస్ రికార్డ్స్, చాటింగ్ టెక్ట్స్‌లు కూడా నా దగ్గర ఉన్నాయి.. శ్యామ్ ఇంట్లో కూడా మా విషయం తెలుసు, శ్యామ్ అన్నయ్య చోటా కే నాయుడు తమకు పెళ్లి చేయిస్తానని చెప్పారు, కానీ ఇంట్లో గొడవల కారణంగా కొన్ని రోజులు ఆగమని చెప్పారు.. అయితే ఇప్పుడు స్పందించడం లేదని, నీ దిక్కున్న చోట చెప్పుకో, ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నారు’’అని సాయి సుధ తెలిపింది. ఈ విషయంపై స్పందించిన పోలీసులు శ్యామ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

Sai Sudha

Read: తలసానితో సినీ ప్రముఖుల సమావేశం..