Kalyan Ram : తండ్రి మరణాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయిన కళ్యాణ్ రామ్

బింబిసార చిత్ర యూనిట్ తాజాగా యాంకర్ సుమతో ఓ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలో కీరవాణి మాట్లాడుతూ హరికృష్ణని గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సుమ.....

Kalyan Ram : తండ్రి మరణాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయిన కళ్యాణ్ రామ్

Kalyan Ram :  నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో ఆగస్టు 5 న రాబోతున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో భారీగా తెరక్కించిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. సినిమా రిలీజ్ దగ్గరుండటంతో ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నారు. బింబిసార చిత్ర యూనిట్ తాజాగా యాంకర్ సుమతో ఓ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలో కీరవాణి మాట్లాడుతూ హరికృష్ణని గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సుమ.. మీ తండ్రి గారు మరణించినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, మీకు ఎలా తెలిసింది అని కళ్యాణ్ రామ్ ని అడిగింది.

Prabhas : ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా.. మా సినిమా ఫీల్డ్ కి థియేటరే గుడి

కళ్యాణ్ రామ్ దానికి సమాధానమిస్తూ.. ”ఆ రోజు ఉదయం 5:30 ఆ సమయంలో మా ఇంట్లోనే బాల్కానిలో కూర్చోని టీ తాగుతున్నాను. అప్పుడే నాకు నాన్నతో కలిసి ట్రావెల్ చేస్తున్న శివాజీ అనే వ్యక్తి నుంచి కాల్‌ వచ్చింది. ఫోన్‌ చేసి ఏడుస్తున్నారు. నాకు అర్థం కాక ఏమైంది శివాజీ గారు అని అడుగుతూనే ఉన్నాను అంతలోనే కాల్ కట్ అయింది. ఆ తర్వాత మా మావయ్య ఫ్యాక్టరీలో పనిచేసే ఓ ఉద్యోగి అదే సమయంలో విజయవాడకు వెళ్తూ నాకు కాల్‌ చేసి విషయం చెప్పి యాక్సిడెంట్ వి కొన్ని ఫొటోలు పంపించారు” అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు. కాగా 2018 ఆగస్ట్‌ 29న హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు.