‘కార్తికేయ 2’ చైత్రంలో చిత్రీకరణ మొదలు..
నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ అర్ట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘కార్తికేయ 2’ తిరుమల తిరుపతిలో పూజాకార్యక్రమాలతో ప్రారంభం..
నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ అర్ట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘కార్తికేయ 2’ తిరుమల తిరుపతిలో పూజాకార్యక్రమాలతో ప్రారంభం..
నిఖిల్, చందు మెుండేటిల కాంబినేషన్లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘కార్తీకేయ 2’.. తిరుమల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధానంలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తిరుపతి శాసనసభ్యులు శ్రీ భుమాన కరుణాకర్ రెడ్డి పూజా కార్యక్రమానికి హాజరై కెమెరా స్విఛ్ ఆన్ చేయగా, భూమాన తనయడు శ్రీ అభినయ రెడ్డి హీరో నిఖిల్పై క్లాప్ కొట్టి ‘కార్తీకేయ 2’ షూటింగ్ని ప్రారంభించారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో దర్శకుడు చందుమొండేటి, నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సహనిర్మాత వివేక్ కుచిభోట్ల, చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ : ‘‘దర్శకుడు చందుమొండేటి చేసిన ‘కార్తికేయ’ ఓ రేంజ్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఎనిమల్ హిప్నాటిజం అనే కొత్త కాన్సెప్ట్ని ఆ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయం చేశారు. ఇన్నాళ్ళకి మళ్ళీ మా ఇద్దరి కాంబినేషన్లో ‘కార్తికేయ 2’ రెడీ అవుతుండటం చాలా ఎక్సెైటింగ్గా అనిపిస్తోంది. అంతేకాదు తిరుమల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధానంలో పూజాకార్యక్రమాలతో ఈ సీక్వెల్ ప్రారంభం కావటం చాలా ఆనందంగా ఉంది. అలానే ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా విచ్చేసిన తిరుపతి శాసనసభ సభ్యులు భుమాన కరుణాకర్ రెడ్డి, అవినాష్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఉదయం వెంకటేశ్వర స్వామివారి పాదాల చెంత సినిమా స్క్రిప్ట్ ఉంచి స్వామి ఆశీర్వాదాలు తీసుకున్నాం. ఈ సినిమాలో భారతీయ సంప్రదాయాలను అద్భుతంగా చూపెడుతున్నాం.. ఉగాది తర్వాత రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి సాధ్యమైనంత త్వరగా సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని తెలిపారు.
భుమాన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ : ‘‘నిఖిల్ హీరోగా చందు మెండేటి డైరెక్షన్లో ‘కార్తికేయ 2’ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవం, శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరగడం చాలా ఆనందంగా ఉంది, శ్రీ కృష్టుని చుట్టూ అల్లుకున్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని నిర్మాతలు విశ్వప్రసాద్, అభిషేక్ చెప్పగా చాలా సంతోషంగా అనిపించింది. గతంలో వచ్చిన ‘కార్తికేయ’ ని ఆడియన్స్ ఎంతగా ఆదరించారో అంతకు మించి ఈ సీక్వెల్ని ఆదిరిస్తారని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు.
అభినయ రెడ్డి మాట్లాడుతూ : ‘‘నిఖిల్ గారికి ‘కార్తికేయ 2’ తో మరో విజయం రావడం ఖాయంగానే అనిపిస్తోంది. గతంలో వచ్చిన ‘కార్తికేయ’ ఎంతో ఆటక్టుకుంది. ఈ సినిమా సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. దర్శకుడు చందు మొండేటి ఈ సీక్వెల్ని మెదటి వెర్షన్ని మించే రేంజ్లో రూపొందిస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో పాల్గొనడానికి నన్ను ఆహ్వానించిన చిత్ర నిర్మాతలు విశ్వప్రసాద్ గారికి, అగర్వాల్ గారికి, సహా నిర్మాత వివేక్ గారికి ధన్యవాదాలు’’ అన్నారు.
నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, దర్శకుడు చందు మొండేటి, కో ప్రొడ్యూసర్ వివేక్ మాట్లాడుతూ : ‘‘కార్తీకేయ 2 చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామీ సన్నిధిలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. సోషల్ మీడియాలో కార్తికేయ సీక్వెల్ ఎప్పుడు అని ఇటు నిఖిల్ని, అటు దర్శకుడు చందు మెుండేటిని కామెంట్ చెయ్యని నెటిజన్స్లేరనే చెప్పాలి. ఇక తాజాగా రిలీజ్ చేసిన ‘కార్తికేయ 2’ కి సంబంధించిన టైటిల్ లోగోకి, కాన్సెప్ట్ వీడియోకి భారీ రేంజ్లో రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సీక్వెల్ కూడా కచ్ఛితంగా ఆడియెన్స్కి ఓ స్పెషల్ థ్రిల్ ఇస్తుంది. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన తిరుపతి శాసనసభ్యులు, భూమాన కురణాకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి గార్లకు కృతజ్ఞతలు’’ అని చెప్పారు.
బ్యానర్ : పీపుల్ మీడియా ఫ్యాక్టరి& అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
కొ-ప్రోడ్యూసర్ : వివేక్ కూచిభొట్ల
నిర్మాతలు : టి.జి విశ్వ ప్రసాద్&అభిషేక్ అగర్వాల్
కథ-స్క్రీన్ప్లే-దర్శకత్యం : చందు మెుండేటి.