Liger Movie: ఓటీటీ స్ట్రీమింగ్కు లైగర్.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీ ‘లైగర్’ రిలీజ్కు ముందర ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఈ సినిమాను రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తనదైన మార్క్తో తెరకెక్కించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డుల సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.
Liger Movie: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీ ‘లైగర్’ రిలీజ్కు ముందర ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఈ సినిమాను రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తనదైన మార్క్తో తెరకెక్కించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డుల సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో ప్రమోట్ చేయడంతో ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి బజ్ క్రియేట్ చేసింది. కాగా, ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ రోజునే మిక్సిడ్ టాక్ను సొంతం చేసుకుంది.
Liger Locks OTT Partner: ఇవాళే రిలీజ్.. అప్పుడే ఓటీటీ ఫిక్స్..!
దీంతో ఈ సినిమా కలెక్షన్లు పడిపోతూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు. లైగర్ చిత్ర ఓటీటీ రైట్స్ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం డిస్నీప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాను రిలీజైన 50 రోజుల తరువాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ.. లైగర్ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో, ఈ సినిమాను తొలుత అనుకున్న దానికంటే ముందుగానే స్ట్రీమింగ్ చేసేందుకు సదరు ఓటీటీ నిర్వాహకులు రెడీ అయ్యారు.
Liger Movie : లైగర్లో మైక్ టైసన్తో విజయ్ దేవరకొండకి ఫైట్ ఉందా.. పూరి జగన్నాధ్ ఏం చెప్పాడంటే..?
ఇక దీనికోసం లైగర్ టీమ్కు భారీ మొత్తాన్ని కూడా చెల్లించడంతో, వారు కూడా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో, లైగర్ చిత్రాన్ని సెప్టెంబర్ 22 నుంచి డిస్నీప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి లైగర్ చిత్రానికి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో అందాల భామ అనన్య పాండే హీరోయిన్గా నటించగా, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాను కరణ్ జోహర్, ఛార్మీతో కలిసి పూరీ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.