Manchu Vishnu : దమ్ముంటే వాళ్ళ అడ్రస్ పెట్టమనండి.. ట్రోలర్స్ పై మంచు విష్ణు వ్యాఖ్యలు..

మంచు విష్ణు మాట్లాడుతూ.. ''మన చుట్టూ పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అని మనం ఆలోచిస్తే ముందుకెళ్ళలేము. అందరి మీద సరదాగా ట్రోలింగ్ జరుగుతుంది. కానీ నాపై ట్రోలింగ్ డబ్బులిచ్చి చేయిస్తున్నారు. వాళ్లెవరో కూడా..............

Manchu Vishnu : దమ్ముంటే వాళ్ళ అడ్రస్ పెట్టమనండి.. ట్రోలర్స్ పై మంచు విష్ణు వ్యాఖ్యలు..

Manchu Vishnu comments on Trollers

Manchu Vishnu :  మంచు విష్ణు హీరోగా సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా జిన్నా. మంచు విష్ణు చాలా రోజుల తర్వాత థియేటర్స్ లో కనిపించనున్నారు. ఈ సినిమాపై మంచి హైప్ ని క్రియేట్ చేస్తున్నారు మంచు విష్ణు. దివాళీ కానుకగా అక్టోబర్ 21న జిన్నా సినిమా రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు 10 టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో మంచుకి విష్ణు ట్రోలర్స్ పై మరోసారి స్పందించారు. మంచు విష్ణు మాట్లాడుతూ.. ”మన చుట్టూ పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అని మనం ఆలోచిస్తే ముందుకెళ్ళలేము. అందరి మీద సరదాగా ట్రోలింగ్ జరుగుతుంది. కానీ నాపై ట్రోలింగ్ డబ్బులిచ్చి చేయిస్తున్నారు. వాళ్లెవరో కూడా నాకు తెలుసు. అవి చూసి నవ్వుకొని వదిలేస్తాను. వాళ్ళు నన్ను ఏదో చేయాలనుకుంటున్నారు. కానీ నేను అది లెక్క కూడా చెయ్యట్లేదు. పైన దేవుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు. నేను ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తాను. ఎవరైనా తెలిసి నా మీద కామెంట్ చేస్తే తీసుకుంటాను. కానీ నా మీద కామెంట్ చేసేవాళ్ళు ఎవ్వరూ తెలీదు. వాళ్ళని ఎవరినన్నా దమ్ముంటే నంబర్, అడ్రస్ పెట్టి కామెంట్ చేయమనండి, ఒక్కరు కూడా చేయరు.” అని అన్నారు.

Karthi : ఎవర్రా మీరంతా.. ఇంత ప్రేమని ఇస్తున్నారు.. ఖైదీ 2 నెక్స్ట్ ఇయర్ రాబోతుంది..

అలాగే ”ట్విట్టర్ లో ఎక్కువ నెగిటివిటీ ఉంది. అక్కడ అందరూ కొట్టుకుంటారు ఈ ట్రోలింగ్స్ తో. అందుకే ఎక్కువ స్టార్స్ ట్విట్టర్ లో ఎక్కువ యాక్టీవ్ గా ఉండరు.” అని అన్నారు. అలాగే జిన్నా తర్వాత శ్రీనువైట్లతో సినిమా ఉండబోతుంది అని తెలిపారు.