‘మహర్షి’ మ్యూజికల్ జర్నీ

  • Published By: madhu ,Published On : March 27, 2019 / 04:27 AM IST
‘మహర్షి’ మ్యూజికల్ జర్నీ

టాలీవుడ్ ప్రిన్స్ ’మహేష్ బాబు’ చిత్రం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకొంటూనే ఉంది. సినిమాకు సంబంధించి విషయాలు ఏవీ బయటకు రావడం లేదు. సినిమా మే 9వ తేదీన రిలీజ్ చేస్తునట్లు దర్శక, నిర్మాతలు ప్రకటించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే విడుదలకు రోజులు దగ్గర పడుతున్నా..ప్రమోషన్ల హడావుడి మొదలు కాకపోవడంతో ఫ్యాన్స్ కొంత నిరాశతో ఉన్నారు. 
Read Also : రాణి ముఖర్జీ ‘Mardani 2’ షూటింగ్ మొద‌లు

తాజాగా మ్యూజికల్ జర్నీ రాబోతోందంటూ దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రకటించారు. అంతేకాదు..ఓ ఫొటో కూడా రిలీజ్ అయ్యింది. ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిపోతోంది. సముద్ర తీరం వద్ద మహేశ్..అల్లరి నరేష్..పూజా హెగ్డే నిలబడి ఉన్నారు. 29 మార్చి 9.09 గంటలకు ‘మహర్షి’ మ్యూజికల్‌ జర్నీ ప్రారంభం కాబోతోందని వెల్లడించారు వంశీపైడిపల్లి. సూపర్‌స్టార్‌తో ఫ్రెండ్‌షిప్‌ను సెలబ్రేట్‌ చేసుకోవడానికి సిద్ధంకండి పేర్కొన్నారు. సినిమాలోని ‘చోటీ చోటీ బాతే’ అనే తొలి పాటను 29న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. కార్పొరేట్ కంపెనీ అధినేత అయిన మహేష్.. తన బాల్య మిత్రుడి కోసం పల్లెటూరికి వచ్చి వ్యవసాయం చేస్తాడని టాక్. 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమాస్‌, వైజయంతి మూవీస్‌ బ్యానర్లు సంయుక్తంగా ‘మహర్షి’ సినిమా తెరకెక్కుతోంది. ‘భరత్ అనే నేను’ సినిమా అనంతరం మహేశ్ నటిస్తున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ‘అల్లరి నరేష్’ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. మహేశ్ బాబు గర్ల్ ఫ్రెండ్‌గా ‘మీనాక్షి దీక్షిత్’ కనిపిస్తారంట.

Read Also : నాకు బతకడమే ఓ కల : 28న ఐరా