Mythri Movie Makers : టాలీవుడ్‌ని రూల్ చేస్తున్న ప్రొడక్షన్ హౌస్.. వామ్మో ఇన్ని సినిమాలా..

దాదాపు 10 సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది మైత్రి నిర్మాణ సంస్థ. మైత్రి చేతిలో దాదాపు వెయ్యి కోట్లకు పైగానే బడ్జెట్ లాక్ అయ్యి ఉంది. స్టార్ హీరోలతో పాటు...................

Mythri Movie Makers : టాలీవుడ్‌ని రూల్ చేస్తున్న ప్రొడక్షన్ హౌస్.. వామ్మో ఇన్ని సినిమాలా..

Mythri

 

Mythri Movie Makers :   కరోనా తర్వాత టాలీవుడ్ మళ్ళీ ట్రాక్ లో పడింది. ఎక్కడ చూసినా సినిమాలే సినిమాలు . హీరోలు, డైరెక్టర్లతో పాటు ప్రొడక్షన్ హౌజ్ లు కూడా వరస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాయి. ఇండస్ట్రీలో చాలా ప్రొడక్షన్ హౌజ్ లున్నా పెద్ద బ్యానర్లు మాత్రం తక్కువగానే ఉంటాయి. గత కొన్ని రోజులుగా అగ్ర నిర్మాత దిల్ రాజు తన బ్యానర్లో వరుస సినిమాలు చేస్తున్నా ఆయన్ని కూడా దాటేసింది ఓ బ్యానర్. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న గీతాఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్.. ఇలాంటి పెద్ద బ్యానర్స్ ని దాటుకొని వరుస సినిమాలు, వరుస హిట్స్ తో ముందుకెళ్తుంది ఓ సంస్థ. అదే మైత్రి మూవీ మేకర్స్.

శ్రీమంతుడు సినిమాతో స్టార్ట్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ప్రయాణం మూడు హిట్లు, ఆరు సక్సెస్ లతో దూసుకుపోతోంది. తాజాగా సర్కారు వారి పాట సినిమాతో మరో భారీ విజయం అందుకుంది. టాలెంట్ తో పాటు సక్సెస్ ఉన్న డైరెక్టర్ కనిపిస్తే చాలు మైత్రీలో అడుగు పెట్టాల్సిందే. ప్రస్తుతం దాదాపు 10 సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది మైత్రి నిర్మాణ సంస్థ. మైత్రి చేతిలో దాదాపు వెయ్యి కోట్లకు పైగానే బడ్జెట్ లాక్ అయ్యి ఉంది. స్టార్ హీరోలతో పాటు అప్ కమింగ్ హీరోలతో ఇంట్రస్టింగ్ కంటెంట్ ప్రజెంట్ చేస్తుంది మైత్రి మూవీ మేకర్స్.

Sunil : కమెడియన్, విలన్.. మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోతున్న సునీల్..

ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ చేతిలో ఉన్న సినిమాలు..

పుష్పతో భారీ విజయం అందుకున్న మైత్రి పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ చెయ్యడానికి వెయిట్ చేస్తోంది. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో ఈ సారి అస్సలు తగ్గేదేలే అంటున్నారు మైత్రి ప్రొడ్యూసర్లు నవీన్ యెర్నేని, రవి శంకర్, మోహన్ చెరుకూరి.

టాలీవుడ్ లో టాలెంట్ డైరెక్టర్స్ ను వెతికి మరీ అవకాశం ఇచ్చే మైత్రీమూవీస్ పక్క రాష్ట్రాలలో మోస్ట్ వాంటేడ్ డైరెక్టర్స్ పై కన్నేసింది. ఇప్పటికే కన్నడ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను లాక్ చేసుకున్నారు మైత్రీ మూవీస్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన KGF నేషనల్ వైడ్ గా ఎలాంటి కలెక్షన్ల సునామి క్రియేట్ చేసిందో చెప్పనక్కర్లేదు. మరి అలాంటి డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమాని ప్రొడ్యూస్ చెయ్యబోతున్నారు మైత్రి మేకర్స్. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబందించి లేటెస్ట్ గా లుక్ కూడా రిలీజ్ చేశారు ప్రశాంత్ నీల్.

మెగాస్టార్ చిరంజీవితో మాంచి మాస్ మసాలా మూవీ చేస్తున్నారు మైత్రి ప్రొడ్యూసర్లు . చిరంజీవి, బాబీ కాంబినేషన్లో 100కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో చిరంజీవి మాస్ పవర్ ని చూపించేలా ప్లాన్ చేస్తున్నారు మైత్రి నిర్మాతలు. ఈ సినిమాకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ అనుకుంటున్నారు.

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ డైరెక్షన్లో శృతిహాసన్ హీరోయిన్ గా మరో భారీ సినిమాని తెరకెక్కిస్తున్నారు ఈ నిర్మాతలు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ బడ్జెట్ దాదాపు 70కోట్లు. ఈ సినిమాకి జై బాలయ్య అనే టైటిల్ అనుకుంటున్నారు.

హీరో విజయ్ దేవరకొండతో సమంత కాంబినేషన్ లో శివ నిర్వాణ డైరెక్షన్లో ఖుషి సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది.

నాని,నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో 30 కోట్ల బడ్జెట్ తో అంటే సుందరానికి తెరకెక్కింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది.

కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త డైరెక్టర్ డైరెక్షన్లో 20 కోట్ల బడ్జెట్ తో మరో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమా.

యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో రమేష్ కడూరి డైరెక్షన్లో 2 కోట్లతో స్మాల్ బడ్జెట్ మూవీ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్.

సుధీర్ వర్మ, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే బ్యూటిఫుల్ రొమాంటిక్ సినిమా కూడా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో 20 కోట్లతో తెరకెక్కుతోంది.

Chandini : నటి, యూట్యూబర్ చాందినిరావు బర్త్‌డే సెలబ్రేషన్స్

ఇవే కాకుండా మరి కొంతమంది యువ డైరెక్టర్స్ కి అడ్వాన్సులు ఇచ్చింది మైత్రి మూవీ మేకర్స్. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ, కనీసం నెలకో సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేయాలి అనుకుంటుంది ఈ సంస్థ. పెద్ద, చిన్న అని తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో అందరికి సపోర్ట్ చేస్తూ భారీ నిర్మాణ సంస్థగా ఎదగడానికి ముందుకు దూసుకెళ్తుంది.