NTR: మహిళ కోసం కుర్చీ తుడిచిన ఎన్టీఆర్.. ఆమె ఎవరు?

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక మహిళ కోసం కుర్చీ తుడిచిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కన్నడలో జరిగే రజ్యోత్సవ వేడుకలకు అక్కడి ప్రభుత్వం జూనియర్ ఎన్టీఆర్ ని అతిథిగా ఆహ్వానించింది. ఈ కార్యక్రమాల్లోనే దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కి "కన్నడ రత్న" ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సభా సమయంలో...

NTR: మహిళ కోసం కుర్చీ తుడిచిన ఎన్టీఆర్.. ఆమె ఎవరు?

NTR clean the chair for the woman

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక మహిళ కోసం కుర్చీ తుడిచిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. RRRతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న తారక్ దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. కాగా కన్నడలో జరిగే రజ్యోత్సవ వేడుకలకు అక్కడి ప్రభుత్వం జూనియర్ ఎన్టీఆర్ ని అతిథిగా ఆహ్వానించింది. ఈ కార్యక్రమాల్లోనే దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కి “కన్నడ రత్న” ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

NTR: అతిధిగా కాదు అప్పు స్నేహితుడిగానే ఇక్కడకి వచ్చా.. ఎన్టీఆర్!

నేడు ప్రత్యేక విమానంలో కన్నడ చేరుకున్నాయి ఎన్టీఆర్ కి అక్కడే రాష్ట్ర మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఇక ఈ వేడుకకు జూనియర్ తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ ఇన్ఫోసిస్ చైర్మన్ సుధా మూర్తి కూడా హాజరయ్యారు. సభా సమయంలో వర్షం పడిన కారణంగా వేదికపై ఉన్న కుర్చీలు తడిసిపోయిన. అయితే సుధా మూర్తి కూర్చోబోతున్న సమయంలో ఎన్టీఆర్ స్వయంగా కుర్చీపై ఉన్న వర్షపు నీళ్లను తుడిచి, ఆమెను గౌరవంగా కుర్చీలో కూర్చోబెట్టాడు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దట్ ఈజ్ ఎన్టీఆర్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో తారక్, పునీత్ రాజ్ కుమార్ గురించి మాట్లాడుతూ.. “ఎటువంటి అహం, యుద్ధం లేకుండా మొత్తం రాజ్యాన్ని గెలుచుకున్న ఏకైక రాజు పునీత్ రాజ్ కుమార్. అప్పు గొప్ప నటుడు డాన్సర్ మాత్రమే కాదు గొప్ప స్నేహితుడు కూడా” అంటూ వ్యాఖ్యానించడంతో పునీత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.