Ram Charan : ముంబై సిద్ధి వినాయక ఆలయంలో రామ్ చరణ్.. అయ్యప్పమాలలో..

ఇటీవల అక్కినేని విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు మొదటిసారి రామ్ చరణ్ అయ్యప్ప మాలలో కనిపించారు. దీంతో చరణ్ మాలలో ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి. తాజాగా రామ్ చరణ్ ముంబైకి వెళ్లారు.

Ram Charan : ముంబై సిద్ధి వినాయక ఆలయంలో రామ్ చరణ్.. అయ్యప్పమాలలో..

Ram Charan in Ayyappa Mala visiting Famous Siddhi Vinayaka Temple in Mumbai

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే గేమ్ ఛేంజర్(Game Changer) షూట్ లో జాయిన్ అవ్వనున్నారు. చరణ్ సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చరణ్ సినిమా షూటింగ్స్ లేకపోయినా ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక చోట కనపడుతూ వైరల్ అవుతున్నారు. ఇక చరణ్ ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేస్తారని తెలిసిందే. ఈ సంవత్సరం కూడా రామ్ చరణ్ అయ్యప్ప మాల వేసుకున్నారు.

ఇటీవల అక్కినేని విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు మొదటిసారి రామ్ చరణ్ అయ్యప్ప మాలలో కనిపించారు. దీంతో చరణ్ మాలలో ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి. తాజాగా రామ్ చరణ్ ముంబైకి వెళ్లారు. నిన్న ముంబై ఎయిర్ పోర్ట్ లో చరణ్ వీడియో వైరల్ అవ్వగా నేడు ఉదయం రామ్ చరణ్ ముంబైలోని ప్రముఖ సిద్ది వినాయక ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయంలో అయ్యప్ప దీక్షను విరమించినట్టు సమాచారం.

Also Read : Salaar Trailer : ప్రభాస్ సలార్ ట్రైలర్ ఆ రోజే రిలీజ్.. పక్కా అంటున్న ఫ్యాన్స్.. నీల్ ఏం ప్లాన్ చేశాడో?

సిద్ధి వినాయక ఆలయ నిర్వాహకులు రామ్ చరణ్ కి స్వాగతం పలికారు. చరణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు చరణ్ ని ఆశీర్వదించారు. దీంతో అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.