సోషల్ మీడియాలో చెర్రీ సెన్సేషన్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ను ఇన్స్టాగ్రామ్లో 2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ను ఇన్స్టాగ్రామ్లో 2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో సరికొత్త మైలు రాయిని అందుకున్నారు. మొదట్లో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటికి దూరంగా ఉన్న చరణ్.. కొద్ది కాలంగా యాక్టివ్గా ఉంటున్నాడు. తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు. చెర్రీని ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా భారీగానే ఉంది.
ఇప్పుడు ఆ సంఖ్య అక్షరాలా 2 మిలియన్లకు చేరింది. గతేడాది జూలైలో చరణ్ ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఇన్స్టాలో తనను ఫాలో అయ్యే వారి సంఖ్య 2 మిలియన్స్కు చేరుకుంది. ఇన్స్టాతో పాటు చెర్రీ ట్విట్టర్, ఫేస్బుక్లోనూ యాక్టివ్గా ఉంటున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్తో కలిసి రామ్చరణ్ నటిస్తోన్న ‘రౌద్రం రణం రుధిరం’(ఆర్ఆర్ఆర్). రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన రామ్చరణ్ బర్త్డే వీడియో ప్రోమోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. 2021 జనవరి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also : అల.. రికార్డుల వేట కొనసాగుతోందిలా..