వర్మ: హీరోలంతా ఎక్కడికిపోయారు? వాళ్లు సరే.. ఇంతకీ నీ హీరోయిన్ ఎప్పుడొస్తుంది!

కరోనా ఎఫెక్ట్ - హీరోలపై రామ్ గోపాల్ వర్మ సెటైర్స్..

  • Published By: sekhar ,Published On : March 7, 2020 / 09:59 AM IST
వర్మ: హీరోలంతా ఎక్కడికిపోయారు? వాళ్లు సరే.. ఇంతకీ నీ హీరోయిన్ ఎప్పుడొస్తుంది!

కరోనా ఎఫెక్ట్ – హీరోలపై రామ్ గోపాల్ వర్మ సెటైర్స్..

క్రాంటవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ ఎవరి మాటా వినడు సీతయ్య టైపు అనే సంగతి తెలిసిందే. కరోనా వచ్చినా, సునామీ వచ్చినా, భూకంపమొచ్చి భూమి బద్దలవుతున్నావోడ్కా వీడడు.. ట్వీట్‌లు చేయడం మానడు.. మొన్నటి వరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటన గురించి ట్వీట్లేసిన వర్మ.. కొద్దిరోజులుగా కరోనా వైరస్‌పై తనదైన శైలిలో సెటైర్లు వేస్తున్నాడు.. తాజాగా ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రామ్‌గోపాల్ వర్మ ఓ పంచ్ వేశాడు.

‘విలన్‌లా భయపెడుతున్న ఈ కరోనా వైరస్‌ను ఎదుర్కోవాల్సిన హీరోలందరూ ఎక్కడికి పోయారు’ అంటూ ట్వీట్ చేశాడు. ఓపక్క ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్‌ ఇంతలా గడగడలాడిస్తుంటే.. సూపర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్ లాంటి  హీరోలందరూ ఎక్కడ ఉన్నారు. వాళ్లు వేరే గ్రహానికి పారిపోయారని మాత్రం చెప్పకండే’ అంటూ వర్మ ట్వీట్ చేయగా.. హీరోల సంగతి సరే కానీ.. ఇంతకీ నీ హీరోయిన్ ఎప్పుడొస్తుందో చెప్పు అంటూ నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు..

‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ పేరుతో తన దర్శకత్వంలో ఆర్జీవీ ఎప్పటినుంచో ఓ సినిమా రూపొందిస్తున్నాడు. పూర్తిగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మొదటి ఇండియన్ చిత్రంగా దీనిని పరిగణిస్తున్నారు. మొదటి నుంచి విభిన్నచిత్రాలు చేస్తూ.. ఓ ప్రత్యేక పంథాకు తెరతీసిన వర్మ మార్షల్ ఆర్ట్స్‌కు గ్లామర్‌ను మేళవించి మరో కొత్త ట్రెండుకు తెర తీయబోతున్నాడు. ఇండో చైనీస్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో టైటిల్ పాత్రధారి పూజా భలేకర్ చేసిన రిస్కీ ఫైట్స్ అత్యంత ఆకర్షణీయంగా, ఒళ్ళు గగుర్పొడిచేవిధంగా ఉండనున్నాయట.

అయితే ఈ సినిమా చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. చైనాలో ఇంకా కొంత భాగం చిత్రీకరించాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. కరోనా తగ్గేదెప్పుడు.. సినిమా పూర్తయ్యేది ఎప్పుడు.. నీ హీరోయిన్‌ని మేం వెండితెర మీద చూసి.. ఆ అందాల విందు ఆరగించేదెప్పుడు అంటూ నెటిజన్స్ వర్మకు రివర్స్ పంచ్‌లు వేస్తున్నారు.