Rambha-Kushboo : చాలా రోజుల తర్వాత కలిసిన అలనాటి తారలు.. వైరల్ అవుతున్న ఫొటోలు..

తెలుగు, త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌ల‌ను అప్పట్లో ఒక ఊపు ఊపేసిన రంభ, ఖుష్బూ చాలా రోజుల తర్వాత కలిశారు. అప్పట్లో టాప్ హీరోయిన్స్ గా ఉన్న వీళ్ళు ఆ తర్వాత.......

Rambha-Kushboo : చాలా రోజుల తర్వాత కలిసిన అలనాటి తారలు.. వైరల్ అవుతున్న ఫొటోలు..

rambha met kushboo

Rambha-Kushboo :  తెలుగు, త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌ల‌ను అప్పట్లో ఒక ఊపు ఊపేసిన రంభ, ఖుష్బూ చాలా రోజుల తర్వాత కలిశారు. అప్పట్లో టాప్ హీరోయిన్స్ గా ఉన్న వీళ్ళు ఆ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయారు. రంభ పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతే ఖుష్బూ మాత్రం ఇప్పటికి పలు సినిమాల్లో నటిస్తూ, రాజకీయాల్లో కూడా బిజీగా ఉంది. తాజాగా రంభ ఇంటికి ఖుష్భు ఫ్యామిలీ వెళ్లి కలిసింది. వీళ్ళు మాత్రమే కాకుండా వారి పిల్లలు కూడా చాలా బాగా కలిసిపోయారు.

ఈ మీట్ కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు రంభ, ఖుష్బూ. రంభ ఇంట్లో ఈ రెండు ఫ్యామిలీలు బాగా ఎంజాయ్ చేశారు. ఖుష్భు ఈ ఫోటోలని షేర్ చేసి.. ”పాత ఫ్రెండ్స్ ని కలవడం కంటే ఏది సంతోషంగా ఉండదు. అలాగే మంచి బిర్యానీని కూడా కలిసి తిన్నాం. మా కంటే మా పిల్లలు కూడా చాలా బాగా క్లోజ్ అయ్యారు. రంభ వాళ్ళింట్లో తనతో చాలా రోజుల తర్వాత టైం స్పెండ్ చేశాను. చాలా మిస్ అయ్యాను. త్వరలో మళ్ళీ కలుద్దాం” అని పోస్ట్ చేసింది.

Amardeep and tejaswini : బుల్లితెర నటుడు అమర్‌దీప్‌, నటి తేజస్విని గౌడ నిశితార్థం ఫొటోలు

ఇక రంభ కూడా ఈ ఫోటోలని షేర్ చేసి.. ”చాలా రోజుల తర్వాత నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో మంచి సమయాన్ని గడిపాను. లవ్ యు ఖుష్బూ” అని పోస్ట్ చేసింది. దీంతో రంభ, ఖుష్బూ కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రంభ కూడా మళ్ళీ సినిమాల్లో కనిపిస్తే చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు.