రిషి కపూర్ ఇకలేరు.

  • Published By: Subhan ,Published On : April 30, 2020 / 03:22 AM IST
రిషి కపూర్ ఇకలేరు.

ఇర్ఫాన్ ఖాన్ మరణవార్త విన్న 24గంటల వ్యవధిలో బాలీవుడ్ సినీ పరిశ్రమకు మరో సారి విషాదఛాయలు అలముకున్నాయి. బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్(67) హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. బుధవారమే ఆరోగ్యం విషమించడంతో రిలయన్స్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ‘క్యాన్సర్ తో బాధపడుతున్న రిషి కపూర్ శ్వాసకోస సమస్యతో బాధపడుతుండటంతో హాస్పిటల్ లో జాయిన్ చేశాం’ అని ఆయన పెద్ద కొడుకు రన్‌ధీర్ కపూర్ వెల్లడించారు. 

సంవత్సరం క్రితమే సెప్టెంబరులో అమెరికాకు వెళ్లి క్యాన్సర్ ట్రీట్‌మెంట్ తీసుకుని ఇండియా వచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ అనారోగ్యంగా అనిపించడంతో కపూర్ రెండుసార్లు హాస్పిటల్ కు వెళ్లారు. ఫ్యామిలీ ఫంక్షన్ కు వెళ్లి ఢిల్లీ హాస్పిటల్ లో చేరిన ఆయనకు ఇన్ఫెక్షన్ అని చెప్పారు వైద్యులు. 

ముంబైకు తిరిగొచ్చిన తర్వాత వైరల్ ఫీవర్ అని హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. కొద్ది రోజులకే ఇంటికి వచ్చారు. తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రిషి కపూర్ కొద్ది కాలంగా ఏప్రిల్ 2నుంచి ట్విట్టర్ కు దూరంగా ఉన్నారు. తన తర్వాతి ప్రాజెక్టు THE INTERN హాలీవుడ్ మూవీ రీమేక్ చేయాలని దీపికా పదుకొణెతో ప్రాజెక్ట్ రెడీ చేసుకున్న రిషి కపూర్ మరణించడంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.