Sai Pallavi : గత జన్మలో తెలంగాణలో పుట్టానేమో

సాయి పల్లవి సినిమాల గురించి మాట్లాడుతూ..''నాకు సినిమా సినిమాకు మధ్య వచ్చే గ్యాప్‌ గురించి నేను ఆలోచించను. నాకు కళపై పూర్తి నమ్మకం ఉంది. ఏదైనా కథ మనకు రాసి పెట్టి ఉంటే

Sai Pallavi : గత జన్మలో తెలంగాణలో పుట్టానేమో

Sai Pallavi

sai pallavi  :  రానా, సాయి పల్లవి జంటగా, నందితాదాస్, ప్రియమణి, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలుగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరాటపర్వం. నక్సల్స్ నేపథ్యంలో ప్రేమ, భావోద్వేగాలతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన విరాటపర్వం జూన్ 17న రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

సినిమా రిలీజ్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సాయి పల్లవి సినిమాల గురించి మాట్లాడుతూ..”నాకు సినిమా సినిమాకు మధ్య వచ్చే గ్యాప్‌ గురించి నేను ఆలోచించను. నాకు కళపై పూర్తి నమ్మకం ఉంది. ఏదైనా కథ మనకు రాసి పెట్టి ఉంటే అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుందని నమ్ముతాను. నా కోసమే కొందరు దర్శకులు కొన్ని పాత్రలను సృష్టిస్తున్నారు అని అంటున్నారు అది నిజంగా నాకు సంతోషం కలిగించే విషయమే. మనం ఉన్నా లేకున్నా సినిమాలు శాశ్వతంగా ఉంటాయి. నేను వెళ్లిపోయిన తర్వాత కూడా నేను యాక్ట్‌ చేసిన ఓ సినిమాను చూసి ప్రేక్షకులు నన్ను మెచ్చుకోవాలనే ఆలోచనతోనే సినిమాని ఒప్పుకుంటాను” అని తెలిపింది.

Karnataka CM: సినిమా చూసి.. వెక్కివెక్కి ఏడ్చిన కర్ణాటక సీఎం..

ఇక వరుసగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ సినిమాలు చేయడంపై మాట్లాడుతూ.. ”ఫిదా, లవ్‌స్టోరీ, ఇప్పుడు విరాటపర్వం.. ఇలా వరుసగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలు చేశాను. మా ఇంట్లో కూడా నేను చాలా మారిపోయానని అంటున్నారు. ఒకవేళ గత జన్మలో నేను ఇక్కడే పుట్టానేమో” అని చెప్పింది సాయిపల్లవి.