Mahesh Babu : రీజనల్ సినిమాతో 160 కోట్ల గ్రాస్.. 100 కోట్ల షేర్.. మహేష్ స్టామినాతో అదరగొడుతున్న ‘సర్కారు వారి పాట’

నిమా రిలీజ్ అయిన అయిదు రోజులకే సర్కారు వారి పాట సినిమా 160 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా 100 కోట్ల షేర్ ని సాధించింది. ఒక రీజనల్ సినిమా ఇంత తక్కువ టైంలో..........

Mahesh Babu : రీజనల్ సినిమాతో 160 కోట్ల గ్రాస్.. 100 కోట్ల షేర్.. మహేష్ స్టామినాతో అదరగొడుతున్న ‘సర్కారు వారి పాట’

Ssmb

Sarkaru Vaari Paata :  సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా థియేటర్లలో వసూళ్ల సునామి కురిపిస్తుంది. పరశురామ్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కగా రిలీజ్ రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కేవలం తెలుగు సినిమాగానే రిలీజ్ అయి వసూళ్లతో అదరగొడుతుంది.

కేవలం సినిమా రిలీజ్ అయిన అయిదు రోజులకే సర్కారు వారి పాట సినిమా 160 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా 100 కోట్ల షేర్ ని సాధించింది. ఒక రీజనల్ సినిమా ఇంత తక్కువ టైంలో ఇన్ని కలెక్షన్స్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. మహేష్ బాబు స్టామినా ఇది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక అమెరికాలో కూడా కలెక్షన్స్ దుమ్ము దులిపేస్తున్నాయి. ఇప్పటికే 2 మిలియన్ డాలర్స్ కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించి దూసుకుపోతుంది సర్కారు వారి పాట. మహేష్ ఫ్యాన్స్ ఈ కలెక్షన్స్ ని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Pooja Hegde : పూజాహెగ్డే వెంకటేష్‌తో ఇక్కడ స్పెషల్ సాంగ్.. అక్కడ చెల్లెలుగా..

ఒక రీజనల్ సినిమాతోనే మహేష్ ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తే ఇక పాన్ ఇండియా సినిమా అయితే బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుంది అంటున్నారు ఫ్యాన్స్. వచ్చే వారం వరకు పెద్ద సినిమాలు ఏమి లేకపోవడంతో ఈ కలెక్షన్ల వరద కొనసాగేలాగే ఉంది. ఇక సినిమా ఈ రేంజ్ లో విజయం సాధించడంతో సోమవారం రాత్రి కర్నూలులో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు చిత్ర యూనిట్.