Actress Death: సినిమా విడుదలకు ముందే కారు ప్రమాదంలో నటి మృతి

గోవాలోని బాఘా-కలంగుట్ వద్ద పూణేకు చెందిన నటి ఈశ్వరీ దేశ్‌పాండే మరియు ఆమె స్నేహితుడు శుభమ్ డేడ్జ్ మరణించారు.

Actress Death: సినిమా విడుదలకు ముందే కారు ప్రమాదంలో నటి మృతి

Actress

Marathi Actor Ishwari Deshpande: గోవాలోని బాఘా-కలంగుట్ వద్ద సోమవారం ఉదయం వంతెనపై నుంచి కారు క్రీక్‌లో పడిపోవడంతో పూణేకు చెందిన నటి ఈశ్వరీ దేశ్‌పాండే మరియు ఆమె స్నేహితుడు శుభమ్ డేడ్జ్ అక్కడికక్కడే మరణించారు. హిందీ మరియు మరాఠీ సినిమాలలో నటించిన ఈశ్వరీ దేశ్‌పాండే తన రెండు సినిమాలు విడుదలకు ముందే చనిపోయారు. మరణించిన శుభమ్ మరియు ఈశ్వరి బుధవారం పూణే నుండి గోవాకు వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో రోడ్డుపై వాహనం అదుపు తప్పి నేరుగా క్రీక్‌లోని లోతైన వాగులోకి దూసుకెళ్లింది.

ప్రమాదం తరువాత, సెంట్రల్ లాక్ కారణంగా ఈశ్వరి మరియు శుభమ్ కారులోనే ఇరుక్కుపోయారు.నాసికా రంధ్రాల్లోకి నీరు వెళ్లడంతో వారు మరణించారు. ఈశ్వరి దేశ్ పాండే ఒక మరాఠీ మరియు హిందీ చిత్రంలో నటించగా.. సినిమాల షూటింగ్ పూర్తయింది. కానీ వెండితెరపై తనను తాను చూసుకునే అవకాశం మాత్రం రాలేదు. ఈశ్వరి దేశ్‌పాండే మొదటి సినిమా సునీల్ చౌతమాల్ దర్శకత్వం వహించిన ‘ప్రేమచే సైడ్ ఎఫెక్ట్స్’. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. సినిమా రిలీజ్ త్వరలో ఉండగా.. ఈలోపే ఆమె ప్రమాదవశాత్తు మరణించింది.

వచ్చే నెలలో ఎంగేజ్‌మెంట్:
నటి ఈశ్వరి దేశ్‌పాండే మరియు శుభమ్ డేడ్గే ఏడాది కాలంగా డేటింగ్‌లో ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయం స్నేహంగా మరియు ప్రేమగా రూపాంతరం చెంది, చివరకు పెళ్లి పీటలు ఎక్కే సమయానికి ఇద్దరినీ మృత్యువు కబలించింది. వచ్చే నెలలో వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ చేసి, తర్వాత పెళ్లి చెయ్యాలని ఇరువైపుల పెద్దలు నిర్ణయించారు. ఈలోపే ఇలా జరిగిపోయింది.

ప్రమాదం ఎలా జరిగింది?
గోవాలోని బార్డెజ్ తాలూకాలోని అర్పోరాలోని హడ్‌పోడ్ గ్రామ సమీపంలో ఉదయం 5.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ కారు నియంత్రణ కోల్పోయి ఎదురుగా ఉన్న క్రీక్‍‌లోకి దూసుకెళ్లాడు. వారిద్దరి చేతికి రిస్ట్‌బ్యాండ్‌లు ఉన్నాయి. ప్రమాదానికి ముందు రోజు రాత్రి వారు పబ్‌కు వెళ్లి ఉండవచ్చని పోలీసులు ఊహించారు. శుభమ్ డెడ్జ్ పుణెలోని కిర్కట్వాడి ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు.