Corona In India : దేశంలో కొత్తగా 67,208 కరోనా కేసులు నమోదు
దేశంలో కొత్తగా 67,208 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,00,313కు చేరింది.
New Corona ceses In India : దేశంలో కొత్తగా 67,208 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,00,313కు చేరింది. అలాగే మృతుల సంఖ్య మొత్తం 3,81,903గా ఉంది. మొత్తం 26,55,19,251 మందికి వ్యాక్సిన్లు మొత్తం 38,52,38,220 కరోనా పరీక్షలు నిర్వహించగా యాక్టివ్ కేసులు దేశవ్యాప్తంగా 8,26,740గా ఉన్నాయి. దేశంలో బుధవారం (జూన్ 16,2021) 67,208 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే కరోనా బారిన పడి నిన్న ఒక్కరోజే 1,03,570 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,00,313కు చేరింది. ఈక్రమంలో దేశవ్యాప్తంగా మరో 2,330 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,81,903కు పెరిగింది.
అలాగే కరోనా నుంచి దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 2,84,91,670 మంది కోలుకున్నారు. 8,26,740 మందికి ఆసుపత్రుల్లోను..అలా కొంతమంది హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు.అలాగే దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో ఇప్పటివరకు మొత్తం 26,55,19,251 మందికి వ్యాక్సిన్లు వేయించుకున్నట్లుగా తేలింది. దేశంలో నిన్నటి వరకు మొత్తం 38,52,38,220 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. ఈ క్రమంలో బుధవారం ఒక్కరోజే 19,31,249 శాంపిళ్ల పరీక్షలు నిర్వహించారు.