Madhya Pradesh : పెళ్లి జరుగుతుండగా విషం తాగిన వధూవరులు.. వరుడు మృతి, వధువు పరిస్థితి విషమం

వివాహ సందర్భంగా వధూవరుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మొదటగా వరుడు విషం తాగాడు. ఈ విషయాన్ని వధువుకు చెప్పాడు. దీంతో ఆమె కూడా విషం తాగారు.

Madhya Pradesh : పెళ్లి జరుగుతుండగా విషం తాగిన వధూవరులు.. వరుడు మృతి, వధువు పరిస్థితి విషమం

Groom Died (1)

Madhya Pradesh – Groom Died : పెళ్లి వేడుకలో వధూవరులు విషం తాగారు. వరుడు మృతి చెందగా, వధువు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనాడియా ప్రాంతంలోని ఆర్యసమాజ్ దేవాలయంలో 21 ఏళ్లు యువకుడికి 20 ఏళ్ల యువతితో మంగళవారం వివాహం జరుగుతోంది.

అయితే వివాహ సందర్భంగా వధూవరుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మొదటగా వరుడు విషం తాగాడు. ఈ విషయాన్ని వధువుకు చెప్పాడు. దీంతో ఆమె కూడా విషం తాగారు. గమనించిన బంధువులు చికిత్స కోసం వెంటనే వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు.

Marriage: పెళ్లి పీటలపై కుప్పకూలిన వరుడు.. పెళ్లి కూతురు తల్లిదండ్రులు చేసిన పనికి అంతాషాక్..

అయితే అప్పటికే వరుడు మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. వధువు ఆరోగ్య పరస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. కాగా, తనను పెళ్లి చేసుకోవాలని వధువు గత కొన్ని రోజులుగా ఒత్తిడి చేస్తున్నారని వధువు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

అయితే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నానని, రెండేళ్లు ఆగాలని అతడు చెప్పగా యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ వివాహం జరుగుతుండగా ఇలా జరిగిందని వాపోయారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.