స్కూల్, కాలేజీలకు వెళ్లాలంటే..పేరెంట్స్ అనుమతి తప్పనిసరి

  • Published By: madhu ,Published On : September 11, 2020 / 08:56 AM IST
స్కూల్, కాలేజీలకు వెళ్లాలంటే..పేరెంట్స్ అనుమతి తప్పనిసరి

స్కూల్, కాలేజీలకు వెళ్లాలంటే..పేరెంట్స్ అనుమతి తప్పనిసరా ? ఏంటీ చదువుకోవడానికి ఎవరైనా అడ్డు చెబుతారా అని అనుకుంటున్నారా ? కానీ..కరోనా అలా చేసింది మరి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఎక్కడ వైరస్ సోకుతుందోనని తల్లిదండ్రులు భయపడుతున్నారు.




ఇప్పటికే కొన్ని నెలలుగా స్కూల్స్, కాలేజీలకు తాళాలు పడిన సంగతి తెలిసిందే. విద్యా సంవత్సరం లాస్ కావొద్దనే కారణంతో..కేంద్రం విద్యాలయాలు తెరుచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే..ఇక్కడ కొన్ని కండీషన్స్ పెట్టింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది.

విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి చదువుకోవాలంటే వారి తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతి తప్పనిసరి.
కట్టడి ప్రాంతాల్లో (కంటైన్మెంట్‌ జోన్లలో) విద్యాలయాలు తెరవవద్దు.
ఇతర ప్రాంతాల్లో 9, 10వ తరగతి విద్యార్థులకు స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలను పాక్షికంగా తెరుచు కోవచ్చు.
ఆయా తరగతులకు సంబంధించిన స్కూళ్లు, కాలేజీలు 2020, సెప్టెంబర్ 21 నుంచి తెరుచుకుంటాయి.




ప్రారంభించాలంటే…

ప్రయోగశాలలు, తరగతి గదులతో సహా ఇతర అన్ని ప్రాంతాలను సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేయాలి.
సిబ్బందిని 50 శాతం వరకే రప్పించాలి. ఆన్‌లైన్‌ బోధన, టెలీ కాన్ఫరెన్స్‌ కోసమే వారు రావాల్సి ఉంటుంది.
అధిక వయస్సున్నవారు, గర్భిణి ఉద్యోగులు, ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వారు విద్యార్థులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండొద్దు.
అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడానికి రాష్ట్ర హెల్ప్‌లైన్‌ నంబర్లు, స్థానిక ఆరోగ్య అధికారుల నంబర్లను కనబడేలా ప్రదర్శించాలి.
https://10tv.in/plant-with-4-leaves-sold-4-lakh-rupees-olline-web-site-auction/
బయోమెట్రిక్‌ హాజరుకు బదులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.
సబ్బుతో పాటు చేతులు కడుక్కోవడానికి సౌకర్యాలు ఉండాలి.
అవకాశముంటే బహిరంగ ప్రదేశాల్లో తరగతులు నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవచ్చు.
ప్రార్థనలు, క్రీడలు ఇతరత్రా గుమిగూడే కార్యకలాపాలు నిషేధం.
థర్మల్‌ గన్స్, ఆల్కహాల్‌ వైప్స్‌ లేదా సోడియం హైపోక్లోరైట్‌ సొల్యూషన్స్, సబ్బు వంటివి తగినంతగా ఉండాలి.
ఆక్సిజన్‌ స్థాయిలను లెక్కించడానికి పల్స్‌ ఆక్సీమీటర్‌ తప్పనిసరిగా ఉంచాలి.




పాక్షికంగా తెరిచే విద్యాలయాలు పాటించాల్సిన నిబంధనలు

ఆల్కహాల్‌ ఆధారిత హ్యాండ్‌ శానిటైజర్లను వాడాలి.
తుమ్ము, దగ్గు వస్తే మోచేయిని అడ్డుగా పెట్టుకోవాలి.
ఆరోగ్యసేతు యాప్‌ను ఇన్‌ స్టాల్‌ చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ లేదా దూర విద్యను ప్రోత్సహించాలి.
ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి.
మాస్క్‌లు తప్పనిసరి.
40 నుంచి 60 సెకన్లు తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి.




విద్యాలయాలు తెరిచిన తర్వాత..పాటించాల్సిన నిబంధనలు
లోపలకు వెళ్లే ఎంట్రీ గేట్ వద్ద శానిటైజర్‌ ఉంచాలి. థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలి.
కరోనా లక్షణం లేని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులను మాత్రమే ప్రాంగణంలోకి అనుమతించాలి.
ఎవరికైన పాజిటివ్‌ ఉంటే వెంటనే ప్రాంగణాన్ని క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలి.
ఎక్కడ గుంపులు లేకుండా చూడాలి.

కుర్చీలు, డెస్క్‌ల మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా సీటింగ్‌ ఉండాలి.
నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిల్, ఎరేజర్, వాటర్‌ బాటిల్‌ వంటి వాటిని విద్యార్థులు పంచుకోకుండా చూడాలి.
ప్రయోగశాలల్లో పరికరాలను ఉపయోగించడానికి ముందు, తరువాత తరచుగా శుభ్రం చేయాలి.
క్యాంటీన్లు, మెస్‌లు తెరవకూడదు.
రవాణా సౌకర్యం ఉంటే బస్సులు లేదా ఇతరత్రా వాహనాలను సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేయాలి.
తరచుగా తాకే తలుపులు, ఎలివేటర్‌ బటన్లు, కుర్చీలు, బెంచీలు తదితరమైన వాటిని శుభ్రపరచాలి.