Supreme Court : అటువంటి భార్యాభర్తల్ని కలిసుండమంటే క్రూరత్వానికి పర్మిషన్ ఇచ్చినట్లే.. వారి బంధం ముగియాల్సిందే : సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

అటువంటి భార్యాభర్తలు కలిసి ఉండటం కంటే విడిపోవటమే మేలు. దాంపత్యంలో క్రూరత్వం ఉండకూడదు. మనస్పర్ధలతో జీవితాలను పాడుచేేసుకునేకంటే విడిపోవటమే మేలు. మరమత్తులు చేయలేని కాపురానికి విలువ లేదు.

Supreme Court : అటువంటి భార్యాభర్తల్ని కలిసుండమంటే క్రూరత్వానికి పర్మిషన్ ఇచ్చినట్లే.. వారి బంధం ముగియాల్సిందే : సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court

Supreme Court : ఏ కోర్టు అయినా విడాకులు తీసుకుని విడిపోదామనుకునే భార్యాభర్తల్ని కలపటానికే యత్నిస్తుంది. విడిపోవటానికి గల కారణాలకంటే కలిసి ఉండటానికి గల కారణాల గురించి ఆలోచించమని సూచిస్తుంది. అలా న్యాయస్థానం దంపతుల్ని కలపటానికి ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది. కానీ దేశ సర్వోన్నత న్యాయం అయిన సుప్రీంకోర్టు మాత్రం ఓ దంపతుల విషయంతో కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ భార్యాభర్తల్ని కలిసి ఉండమంటే క్రూరత్వానికి అనుమతి ఇచ్చినట్లే అంటూ అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే సుప్రీంకోర్టు అరుదైన వ్యాఖ్యలు చేస్తుంది. అటువంటి ఓ కేసులో భార్యా భర్తల విడాకుల విషయంలో ఆ భార్యాభర్తల్ని కలిసి ఉండమంటే క్రూరత్వానికి అనుమతి ఇచ్చినట్లే అంటూ అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. మరి ఏమిటా కేసు అంటే..

ఓ జంట వివాహం అయ్యాక కేవలం నాలుగేళ్లు మాత్రమే కలిసి జీవించారు.ఆ తరువాత వారు విడివిడిగా ఉంటున్నారు. ఆ తరువాత ఇద్దరి మధ్యా మనస్పర్ధలు వచ్చాయి. దీంతో వారు విడిగా జీవిస్తున్నారు. అలా 25 ఏళ్లుగా విడివిడిగా ఉంటున్న ఓ జంట విడాకులు కోరుతు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వారి వివరాలు తెలుసుకున్నా సుప్రీంకోర్టు 25 ఏళ్లుగా విడివిడిగా ఉంటున్న వారిని కలిసి ఉండమన్నా… వారిని వివాహితులుగా గుర్తిస్తే క్రూరత్వానికి అనుమతి ఇచ్చినట్లు అవుతుంది అంటూ జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ జేబీ పార్దివాలాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

మనస్పర్ధలతో 25 ఏళ్ల నుంచి వేర్వేరుగా ఉంటున్న భార్యాభర్తలు విడాకులు కోరుతూ ఈ జంట దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ జేబీ పార్దివాలాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలిచింది. విచారణ ముగిసాక ధర్మాసనం.. ‘అన్ని అర్ధవంతమైన సంబంధాలను పూర్తిగా తెంచుకోవడం, హిందూ వివాహ చట్టం ప్రకారం ఇరువురు మధ్య ఉన్న చేదు అనుభవాన్ని క్రూరత్వం’అంటూ ధర్మాసనం అభివర్ణించింది. వారికి పిల్లలు లేరు.. వారి వైవాహిక బంధం మరమ్మత్తు చేయలేని విధంగా పూర్తిగా విచ్ఛిన్నమైంది.. ఈ బంధానికి ముగింపు పలకాలి అనే విషయంలో మాకు ఎటువంటి సందేహం లేదు.. దానికి కొనసాగింపు క్రూరత్వమే అవుతుంది.. సుదీర్ఘకాలం విడిపోవడం, సహజీవనం లేకపోవడం, అర్ధవంతమైన బంధాలన్నింటినీ పూర్తిగా తెంచుకోవడం, ఇద్దరి మధ్య ఉన్న చేదు అనుభవాలను హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరత్వంగా పేర్కొవాలి’ అని వ్యాఖ్యానించారు.

Also Read: నా కూతురి వల్లే రిషి సునక్ ప్రధాని కాగలిగాడు.. సుధామూర్తి కామెంట్స్ వైరల్

‘వివాహమైన తర్వాత నాలుగేళ్లు కలిసి, గత 25 ఏళ్లుగా విడివిడిగా జీవిస్తున్న సదరు జంట నాలుగేళ్లు కలిసే ఉన్నారు. ఆ తరువాత మనస్పర్ధలతో విడిపోయారు. వారికి పిల్లలు లేరు. వారికి పిల్లలు లేరు.. వారి వైవాహిక బంధం మరమ్మత్తు చేయలేని విధంగా పూర్తిగా విచ్ఛిన్నమైంది.. ఈ బంధానికి ముగింపు పలకాలి అనే విషయంలో మాకు ఎటువంటి సందేహం లేదు, ఎందుకంటే దాని కొనసాగింపు క్రూరత్వమే అవుతుంది’ అని వ్యాఖ్యానించారు. అలాగే భర్త నెలకు రూ.లక్ష సంపాదిస్తున్నాడు కాబట్టి భార్యకు భరణంగా రూ.30 లక్షలు చెల్లించాలని..ఈ భరణాన్ని నాలుగు వారాల్లోగా అందజేయాలని ఆదేశించింది.

భార్యపై భర్త ఆరోపణలు..
ఢిల్లీకి చెందిన సదరు భార్యాభర్తలు 1994లో వివాహం జరిగింది. దీతో గర్భం వద్దనుకున్న భార్య తనకు చెప్పకుండానే అబార్షన్ చేయించుకుందని భర్త ఆరోపించాడు. చిన్నఇంటిలో నివసించటానికి ఆమె ఇష్టపడలేదని ధర్మాసనానికి తెలియజేశాడు.

కేసు పూర్వాపరాలు..
పెళ్లైన నాలుగేళ్ల తర్వాత భర్త ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అతడిని, అతని సోదరుడ్ని అరెస్ట్ చేశారు. తరువాత బెయిల్‌పై విడుదలైన భర్త.. భార్యకు విడాకుల నోటీసులు పంపించాడు. దీంతో భార్యాభర్తలు విడివిడిగా ఉండటంతో ట్రయల్ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. కానీ ఆమె ఈ తీర్పుని అంగీకరించలేదు. ట్రయల్ కోర్టు తీర్పుని ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో ఢిల్లీ హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును తిరస్కరించింది. ఢిల్లీ కోర్టు తీర్పుని భర్త సుప్రీంకోర్టులో సవాల్ చేయటంతో సర్వోన్నత ధర్మానం వారి వివాహాన్ని రద్దు చేసి.. భార్యకు భరణం ఇవ్వాలని తీర్పునిస్తు భర్తకు షాక్ ఇచ్చింది.