Covid Garbage Rickshaw : అయినవారు రాక.. చెత్త రిక్షాలో కాటికి కరోనా మృతదేహం.. వీడియో
హార్ రాష్ట్రంలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి చనిపోయాడు. అతడి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో మున్సిపాలిటీ చెత్త రిక్షాలో స్మశానవాటికకు తరలించారు.
Municipal Staff Cremate Covid Deadbody : బీహార్ రాష్ట్రంలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి చనిపోయాడు. అతడి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో మున్సిపాలిటీ చెత్త రిక్షాలో స్మశానవాటికకు తరలించారు. రాష్ట్రంలోని నలందా జిల్లాకు చెందిన మనోజ్ కుమార్ ఈ నెల 13న కరోనాతో మరణించాడు. అతని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి బంధువులెవరూ ముందుకు రాలేదు.
A #COVID19 patient’s body was carried to the crematorium on a cart of Municipal Corporation in Bihar’s Nalanda yesterday. pic.twitter.com/y3iA2yjlPp
— ANI (@ANI) May 17, 2021
ఆ మృతదేహాన్ని చెత్త రిక్షాలో స్మశాన వాటికకు నలంద మున్సిపల్ సిబ్బంది తరలించారు. పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది కరోనా మృతదేహాన్ని ఖననం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నలంద సివిల్ సర్జన్ స్పందించారు.
కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించడానికి 2 వందలకుపైగా వాహనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.