EV Fires : పేలుతున్న ఈవీ బ్యాటరీలు.. దేశీయంగా బ్యాటరీల ఉత్పత్తియే బెటర్.. నీతి ఆయోగ్
EV Fires : దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు పేలడంపై వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఈ ఘటనలపై నీతి ఆయోగ్ సభ్యుడు, డీఆర్డీఓ మాజీ చీఫ్, ప్రముఖ శాస్త్రవేత్త వీకే సారస్వత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

EV Fires : దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు పేలడంపై వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఈ ఘటనలపై నీతి ఆయోగ్ సభ్యుడు, డీఆర్డీఓ మాజీ చీఫ్, ప్రముఖ శాస్త్రవేత్త వీకే సారస్వత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీ బైక్ల బ్యాటరీలను దేశీయంగా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈవీ బైక్ల కోసం దిగుమతి చేసుకున్న బ్యాటరీల్లో సెల్లు మన దేశ పరిస్థితులకు అనుకూలంగా లేకపోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే స్థానికంగా తయారుచేసిన బ్యాటరీ సెల్ లోనే వినియోగించుకోవాలని ఆయన చెప్పారు.
అధిక ఉష్ణోగ్రతలకు అనుకూలంగా బ్యాటరీ సెల్లను వాటిని రూపొందించకపోవడం, నాణ్యత లేమి కారణంగా పేలుడు వంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. అధిక ఉష్ణోగ్రత కలిగిన స్థానిక పరిస్థితులను తట్టుకుని ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఇప్పటికే కొన్ని దేశాలు అధిక ఉష్ణోగ్రతల వద్ద పనిచేసే సెల్లను అభివృద్ధి చేశాయన్నారు. మరోవైపు విదేశాలనుంచి దిగుమతి చేసుకునే బ్యాటరీల విషయంలో పకడ్బందీ స్క్రీనింగ్ వ్యవస్థతోపాటు కఠినమైన టెస్టింగ్ విధానాలూ అమలు చేయాలని సూచించారు. ఈవీలలో నెంబర్ వన్గా మారేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను పేలుడు ఘటనలు దెబ్బతిస్తాయని వివరించారు.

Need To Set Up Own Manufacturing Unit As Imported Cells Not Suitable For Indian Climate
ఈ ప్రమాదాలు ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగంపై ప్రభావం చూపుతాయన్నారు. ఈవీ బ్యాటరీలపై పేలుడు ఘటనలపై అధికారులు విచారణ జరుపుతున్న నేపథ్యంలో… నిపుణుల ప్యానెల్ నివేదికను సమర్పించింది. లోపాలు కలిగిన అన్ని ఈవీ వాహనాలను రీకాల్ చేయడానికి ఆదేశాలు జారరీ చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో, ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు) అగ్నికి ఆహుతైన సంఘటనలు జరిగాయి. ఫలితంగా మరణాలతోపాటు ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. బ్యాటరీ టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీగా పేర్కొన్నారు.
ప్రస్తుతం భారత్ బ్యాటరీ సెల్లను తయారు చేయడం లేదన్నారు. మన స్వంత సెల్ తయారీ ప్లాంట్లను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. మనం ఏ సెల్ను తయారు చేసినా అది భారతీయ పరిస్థితులకు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి (ఉష్ణోగ్రత) అని సరస్వత్ చెప్పారు. గత నెలలో, పుణెలో రైడ్-హెయిలింగ్ ఆపరేటర్ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆర్మ్లో మంటలు చెలరేగడంతో ప్రభుత్వం ప్రారంభించిన ఈ-స్కూటర్పై విచారణకు ఆదేశించింది. EVలు మంటల్లో చిక్కుకున్న సంఘటనలపై దర్యాప్తు చేసేలా నివారణ చర్యలను సూచించాలని సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (CFEES)ని కోరినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
Read Also : Nitin Gadkari : EV కంపెనీలకు మంత్రి గడ్కరీ హెచ్చరిక.. భద్రత లోపిస్తే భారీ మూల్యం తప్పదు..!
1Bald Head Drug : బట్టతల ఉన్నవారికి ఎగిరి గంతేసే గుడ్న్యూస్..!
2Indian Hockey : అద్భుత విజయంతో సూపర్-4లో హాకీ టీమిండియా
3Telangana Corona News Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
4Ambassador Car: రెండేళ్లలో మళ్లీ రానున్న అంబాసిడర్ కార్
5Modi Tour: మోదీ చెన్నై పర్యటన.. నిధులు విడుదల చేయాలని సీఎం డిమాండ్
6KTR Davos Tour : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు
7Yoga Mahotsav: ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. 200దేశాల్లో యోగా మహోత్సవం
8Yoga Mahotsav : రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్
9Mamata Banerjee: యూనివర్సిటీ ఛాన్స్లర్గా సీఎం.. బెంగాల్లో కొత్త చట్టం
10Shikhar Dhawan: నేల మీద దొర్లుతూ తండ్రి చేతిలో దెబ్బలు తింటున్న ధావన్
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!