India Corona: దేశంలో మళ్లీ 3వేలు దాటిన కొవిడ్ కేసులు.. 31 మంది మృతి

దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ 3వేలు దాటింది. గత వారం రోజులుగా 3వేల మార్కు ను దాటుకుంటూ వస్తున్న కొవిడ్ కేసుల సంఖ్య .. మంగళవారం కాస్త..

India Corona: దేశంలో మళ్లీ 3వేలు దాటిన కొవిడ్ కేసులు.. 31 మంది మృతి

Coronavirus

India Corona: దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ 3వేలు దాటింది. గత వారం రోజులుగా 3వేల మార్కు ను దాటుకుంటూ వస్తున్న కొవిడ్ కేసుల సంఖ్య .. మంగళవారం కాస్త ఊరటనిచ్చింది. కాగా బుధవారం మళ్లీ 3వేల మార్క్ ను దాటి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశంలో 3,205 మందిలో కొవిడ్ లక్షణాలున్నట్లు గుర్తించారు. కరోనాతో చికిత్స పొందుతూ 31 మంది ప్రాణాలొదిలారు.

Coronavirus: కాస్త ఊరట.. భారత్‌లో స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు

మంగళవారం 3.27 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 3,205 మందికి పాజిటివ్ తేలింది. వీటిలో అత్యధిక కేసులు ఢిల్లీలోనే నమోదయ్యాయి. ఢిల్లీలో 1,414 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముందురోజు కంటే 32శాతం అధికంగా నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 5.97 శాతానికి చేరింది. ఇక 24గంటల వ్యవధిలో 2,802 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. కొత్త కేసులు పెరగడంతో క్రియాశీల కేసులు 19,509కి చేరాయి.

Corona Virus : మూడేళ్లైనా కరోనా వైరస్‌ గురించి అంతుచిక్కడం లేదు

మంగళవారం కొవిడ్ తో చికిత్స పొందుతూ 31 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 5,23,920కు చేరింది. కొవిడ్ వ్యాప్తి నివారణకు టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతుంది. తాజాగా 4,79,208 మంది టీకా తీసుకోగా.. ఇప్పటి వరకూ 189 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.