పేలుళ్లతో దద్దరిల్లిన సూరత్‌ హైవే: స్కూల్ విద్యార్ధులకు తప్పిన పెను ప్రమాదం

  • Published By: veegamteam ,Published On : January 9, 2020 / 06:12 AM IST
పేలుళ్లతో దద్దరిల్లిన సూరత్‌ హైవే: స్కూల్ విద్యార్ధులకు తప్పిన పెను ప్రమాదం

గుజరాత్ లోని సూరత్‌ పేలుళ్లతో దద్దరిల్లింది. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఓ ట్రక్‌లో పేలుడు సంభవించింది. దీంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. సిలిండర్ల పేలుడుతో హైవేపై వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. పేలుడు ధాటికి ఏం జరుగుతుందో తెలియక స్థానికులు పరుగులు పెట్టారు. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన  ఘటనాస్థనాలకు చేరుకున్నారు. వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. వెంటనే ప్రమాదస్థలానికి చేరుకున్న ఫైన్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. కాగా ఈ పేలుడు సమీపంలో ఓ స్కూల్ బస్ ఉంది. కానీ ఈ ప్రమాదానికి గురవ్వకుండా బస్ లో ఉన్న విద్యార్దులను సురక్షితంగా కిందికి దించేయటంతో  పెను ప్రమాదం తప్పింది. 

ఈ ప్రమాదం నుంచి ట్రక్ డ్రైవర్ సురక్షితంగా బయటపడినట్లుగా తెలుస్తోంది.ప్రధాన రహదారిపై ప్రమాదం జరగడంతో.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు … ట్రాఫిక్ క్లియర్ చేశారు.