Covid-19 In Maharashtra : మహారాష్ట్ర మంత్రి షిండే, సేన ఎంపీ అర్వింద్ సావంత్ కు కోవిడ్
మహారాష్ట్ర మంత్రి ఏక్ నాథ్ షిండే, శివసేన ఎంపీ అర్వింద్ సావంత్
Covid-19 In Maharashtra : మహారాష్ట్ర మంత్రి ఏక్ నాథ్ షిండే, శివసేన ఎంపీ అర్వింద్ సావంత్ కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని నేతలిద్దరూ మంగళవారం ట్విట్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు.
మంగళవారం మంత్రి షిండే ఓ ట్వీట్ లో… నాకు కరోనావైరస్ పాజిటివ్ గా తేలింది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో, నేను కరోనాను అధిగమించి, త్వరలో నేను మీ సేవలో ఉంటాను. గత కొన్ని రోజులుగా నన్ను సంప్రదించిన వారు జాగ్రత్తగా ఉండాలి”అని పేర్కొన్నారు.
మరొక ట్వీట్లో ఎంపీ సావంత్… “నాకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఇంట్లోనే ఐసొలేట్ అయ్యాను. నన్ను సంప్రదించిన వారందరూ ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి”అని పేర్కొన్నారు.
ALSO READ Covid Cases In Mumbai : ముంబైలో రోజురోజుకీ పెరిగిపోతున్న కోవిడ్ కేసులు