Pani Puri Vendor: పానీ పూరీ అమ్మే వ్యక్తిని రూ.20 కోసం కత్తితో పొడిచిన కస్టమర్
పానీ పూరీ అమ్మే వ్యక్తిని రూ.20 కోసం కత్తితో పొడిచాడు ఓ కస్టమర్. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నాగ్పూర్ పోలీసులు తాజాగా మీడియాకు వివరాలు తెలిపారు. జైరాం గుప్తా అనే వ్యక్తి పానీ పూరీ స్టాల్ పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నాడు.
Pani Puri Vendor: పానీ పూరీ అమ్మే వ్యక్తిని రూ.20 కోసం కత్తితో పొడిచాడు ఓ కస్టమర్. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నాగ్పూర్ పోలీసులు తాజాగా మీడియాకు వివరాలు తెలిపారు. జైరాం గుప్తా అనే వ్యక్తి పానీ పూరీ స్టాల్ పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నాడు.
అతడి స్టాల్ కి సమీపంలో ఓ దుకాణం ఉండేది. అందులో పనిచేసే ఓ వ్యక్తి పానీ పూరీ తిని వెళ్లేవాడు. ఈ క్రమంలో జైరాం గుప్తాకు ఆ కస్టమర్ 20 రూపాయలు బాకీ పడ్డాడు. నిన్న మరోసారి పానీ పూరీ తినేందుకు ఆ వ్యక్తి స్టాల్ వద్దకు వచ్చారు. తనకు ఇవ్వాల్సిన రూ.20 వెంటనే ఇవ్వాలని జైరాం గుప్తా అన్నాడు. దీంతో ఆ కస్టమర్ కు కోపం వచ్చింది.
ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన కస్టమర్… జైరాం గుప్తాను కత్తితో పొడిచాడు. తీవ్రగాయాలపాలైన జైరాం గుప్తాను స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ జరుపుతున్నారని జరిపత్కా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.