గాంధీ ఆత్మ బాధపడుతుంది : బీజేపీ,ఆర్ఎస్ఎస్ పై సోనియా విమర్శలు

  • Published By: venkaiahnaidu ,Published On : October 2, 2019 / 09:55 AM IST
గాంధీ ఆత్మ బాధపడుతుంది : బీజేపీ,ఆర్ఎస్ఎస్ పై సోనియా విమర్శలు

కొన్నేళ్లుగా భారత్ లో జరుగుతున్న పరిస్థితులను చూసి మహాత్మగాంధీ ఆత్మ భాధపడుతుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. ఇవాళ మహాత్మగాంధీ జయంతి సందర్భంగా రాజ్ ఘాట్ లో ఆయనకు నివాళులర్పించిన సోనియా… బీజేపీ,ఆర్ఎస్ఎస్ పై విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లోకి అబద్ధాలతో వచ్చేవాళ్లు మహాత్మా గాంధీని అర్థం చేసుకోలేరన్నారు. గాంధీ ఫిలాసఫీ, అహింస గురించి వారికి అర్థం కాదన్నారు.

తమను తాము సుప్రీంలుగా భావించే వాళ్లు గాంధీ త్యాగాన్ని ఎలా అర్థం చేసుకుంటారని పరోక్షంగా మోడీపై విమర్శలు గుప్పించారు. ఇండియా,గాంధీ పర్యాయపదాలని. అయినప్పటికీ కొంతమంది ఆర్ఎస్ఎస్ ఇండియాకి పర్యాయపదంగా ఉండాలని కోరుకుంటారుని  సోనియా అన్నారు. మహాత్మా ఆదర్శాలకు కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రమాణం చేస్తారని ఆమె తెలిపారు. 

సత్య మార్గాన్ని అనుసరించడం గాంధీజీ ఆజ్ఞయ అని,బీజేపీ మొదట సత్య మార్గాన్ని అనుసరించాలని.తర్వాతే మహాత్మా గాంధీ గురించి మాట్లాడాలపి ఈ సందర్భంగా సోనియా కుమార్తె,కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ అన్నారు.