Kidnap Drama : తనను తానే కిడ్నాప్ చేసుకొని.. భార్య నుంచి లక్షలు డిమాండ్

అప్పుల బాధతో ఓ వ్యక్తి తనకు తానే కిడ్నాప్ చేసుకున్నాడు. నీ భర్తను మేము కిడ్నాప్ చేశాం అంటూ భార్యకు మెస్సేజ్ చేశాడు. రెండు లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడు.

Kidnap Drama : తనను తానే కిడ్నాప్ చేసుకొని.. భార్య నుంచి లక్షలు డిమాండ్

Kidnap Drama

Kidnap Drama : అప్పుల బాధతో ఓ వ్యక్తి తనకు తానే కిడ్నాప్ చేసుకున్నాడు. నీ భర్తను మేము కిడ్నాప్ చేశాం అంటూ భార్యకు మెస్సేజ్ చేశాడు. రెండు లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడు. దీంతో భయపడిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి కిడ్నాప్ మిస్టరీని ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన అనూప్ యాదవ్ అనే వ్యక్తికి అప్పులయ్యాయి.

చదవండి : Kid Kidnap: మధ్యాహ్నం అదృశ్యం.. సాయంత్రానికి చిన్నారి ఆచూకీ కనిపెట్టిన పోలీసులు

అప్పుల ఊబిలోంచి బయటపడాలని ఆలోచన చేసి.. కిడ్నాప్ డ్రామా అల్లాడు. రాష్ట్రంలోని మానేసర్ ప్రాంతాల్లో ఉండి.. భార్యకు కిడ్నాప్ అయినట్లు మెస్సేజ్ చేశారు. రెండు లక్షలు ఇస్తేనే నీ భర్తను వదిలేస్తానని డిమాండ్ చేశాడు. దీంతో భయపడిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతికతను ఉపయోగించి మానేసర్ ప్రాంతం నుంచి ఫోన్‌కి సిగ్నల్స్ వచ్చినట్లు నిర్దారింఛి.. ఆ ప్రాంతంలో తనిఖీలు చేశారు.

చదవండి : Kid Kidnap: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి కిడ్నాప్..!

అయితే అక్కడ అనూప్ యాదవ్ ఒంటరిగా కూర్చొని ఉండటం గమనించిన పోలీసులు.. అదుపులోకి తీసుకోని విచారించారు. దీంతో అసలు విషయం పోలీసులకు తెలిపాడు. అప్పుల బాధ తట్టుకోలేక ఈ నాటకం ఆడినట్లు వివరించాడు. పోలీసులను తప్పుదారి పట్టించినందుకు, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు నిందితులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.