Kerala: కేరళలో బాంబు దాడి చేసింది తానే అంటూ పోలీసుల ముందు లొంగిపోయిన ఓ వ్యక్తి

కేరళ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 9 గంటల సమయంలో పోలీసులకు ఒక కాల్ వచ్చింది. అందులో ఎర్నాకులంలోని కలమస్సేరిలో ఉన్న ఒక కన్వెన్షన్ సెంటర్‌లో పేలుడు సంభవించిందని చెప్పారు

Kerala: కేరళలో బాంబు దాడి చేసింది తానే అంటూ పోలీసుల ముందు లొంగిపోయిన ఓ వ్యక్తి

Kerala: కేరళలోని ఎర్నాకులం సమీపంలో ఉన్న కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్‌లో పేలుళ్లు జరిగి ఒక వ్యక్తి మరణించగా, సుమారు 40 మందికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. అయితే పేలుళ్లకు కారణం తానే అంటూ ఆదివారం సాయంత్రం ఒక వ్యక్తి త్రిస్సూర్ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఆ వ్యక్తి పేరు డోమినిక్ మార్టిన్. కన్వెన్షన్ సెంటర్ లో బాంబులు పెట్టింది తానేనని పోలీసుల ముందు మార్టిన్ ఒప్పుకున్నాడు. అయితే నిజంగా పేలుడు అతడే చేసిండా లేదా అనేది పోలీసులు ఇంకా నిర్ధారణకు రాలేకపోతున్నారు.

కేరళ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 9 గంటల సమయంలో పోలీసులకు ఒక కాల్ వచ్చింది. అందులో ఎర్నాకులంలోని కలమస్సేరిలో ఉన్న ఒక కన్వెన్షన్ సెంటర్‌లో పేలుడు సంభవించిందని చెప్పారు. 5 నిమిషాల విరామం తర్వాత రెండో పేలుడు సంభవించింది. రెండు పేలుళ్ల తర్వాత ఘటనా స్థలంలో గందరగోళం నెలకొంది. పేలుడు ధాటికి అక్కడ మంటలు చెలరేగాయి. ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి పరుగులు తీయడం ప్రారంభించారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, 15-20 నిమిషాల విరామం తర్వాత మూడవ పేలుడు కూడా జరిగింది.

ఈ పేలుడులో ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 7 మంది పరిస్థితి విషమంగా ఉందని, వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పేలుడు ఘటన తర్వాత ప్రభుత్వ ఆరోగ్య ఉద్యోగుల సెలవులను కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ రద్దు చేశారు. అందరూ విధులకు రావాలని ఆయన కోరారు. అదే సమయంలో, పోలీసులు, అగ్నిమాపక దళం పేలుడు స్థలాన్ని చుట్టుముట్టిందని, సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని కేరళ పరిశ్రమల మంత్రి పి రాజీవ్ తెలిపారు. చాలా మందిని రక్షించారు.