Bahujan Samaj Party: సమస్యే లేదు.. బీఎస్పీ తదుపరి చీఫ్ మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనందే!

2017లో మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనంద్ మొదటిసారి తెరపైకి వచ్చారు. మాయావతి తమ్ముడు ఆనంద్ కుమారుడు ఆకాష్. ఆయన లండన్‌లో ఎంబీఏ చదివారు. చదువు పూర్తయ్యాక వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన ఆకాష్ 2017లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు

Bahujan Samaj Party: సమస్యే లేదు.. బీఎస్పీ తదుపరి చీఫ్ మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనందే!

Updated On : August 25, 2023 / 7:57 PM IST

Mayawati and Akash Anand: 1984లో బహుజన్ సమాజ్ పార్టీని కాన్షీరాం స్థాపించారు. అప్పటి నుంచి ఆయనే పార్టీ అధినేతగా ఉంటూ వచ్చారు. అనంతరం 2003 సెప్టెంబర్ 18న బీఎస్పీ చీఫ్‭గా మాయావతి బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి సుమారు రెండు దశాబ్దాలుగా ఆమెనే పార్టీ సుప్రెమోగా ఉన్నారు. అయితే పార్టీలో చాలా కాలంగా తదుపరి చీఫ్ ఎవరనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ పార్టీలో ఎవరి పేర్లు తెరపైకి రాలేదు. పలు సందర్భాల్లో అయితే తదుపరి చీఫ్ కూడా ఎస్సీ సామాజిక వర్గం నుంచే వస్తారని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ ఎవరు అంటే.. పార్టీలో అలాంటి ముఖమే కనిపించలేదు.

Artificial intelligence: అద్భుతాన్ని ఆవిష్కరించిన AI.. మొట్టమొదటిసారిగా డిజిటల్ అవతార్‌ సాయంతో మాట్లాడగలిన పక్షవాతానికి గురైన మహిళ

తాజాగా కొన్ని సందర్భాలను చూస్తుంటే తదుపరి బీఎస్పీ చీఫ్ ఆకాష్ ఆనందేననే విషయం స్పష్టమవుతోందని అంటున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో నిర్వహించే కార్యక్రమాల్లో ఆకాష్ చాలా కీలకంగా ఉంటున్నారు. అలాగే రాష్ట్రాల పర్యటన సమయంలో కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. వీటికి తోడు ఇప్పటికే నేషనల్ కోర్డినేటర్ పదవి ఉంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల బాధ్యత పూర్తిగా ఆకాష్ ఆనంద్ కే అప్పగించారు. గత ఎన్నికల్లో బీఎస్పీ ఆరు స్థానాలు గెలుపొందిన కీలక రాష్ట్రం అది.

ఇక ఒక మూడు ఫొటోలు చూపించి కూడా తదుపరి చీఫ్ ఆకాషేనని కూడా అంటున్నారు. మరి ఆ మూడు ఫొటోల విషయమేంటో చూద్దాం.

1. ఈ చిత్రం ఆగస్టు 23 నాటిది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి లక్నోలో మాయావతి సమావేశం ఏర్పాటు చేశారు. ఆకాష్ ఆనంద్ ను హడావుడిగా సమావేశానికి రమ్మని పిలిచారు. అప్పటికే ఆయన రాజస్థాన్ పర్యటనలో ఉన్నారు. ఈ భేటీ అనంతరం ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని మాయావతి ప్రకటించారు. చిత్రంలో మాయావతితో పాటు ఆకాష్, ఆయన తండ్రి ఆనంద్ కుమార్ ను చూడొచ్చు. ఆనంద్ ప్రస్తుతం బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

2. ఈ చిత్రం ఆగస్టు 14 నాటిది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో వేలాది మంది బీఎస్పీ నేతలతో కలిసి ఆకాష్ ఆనంద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ షో చేపట్టారు. రోడ్ షో అనంతరం బీఎస్పీ నేతలు గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించారు. బీఎస్పీ మెమోరాండంలో దళితులు, గిరిజనులపై అఘాయిత్యాల అంశాన్ని లేవనెత్తారు. మొదటిసారిగా బీఎస్పీకి చెందిన ఒక పెద్ద నాయకుడు నేరుగా రోడ్డుపై ప్రజలతో ప్రదర్శనలో పాల్గొన్నారు. మాయావతి కూడా నిరసన అంశాన్ని లేవనెత్తారు.

3. ఈ చిత్రం జూలై 8వ తేదీది. న్యూఢిల్లీలో పంజాబ్, హర్యానా నేతలతో మాయావతి సమావేశమయ్యారు. సమావేశంలో, నాయకులందరూ మాయావతి ఎదురుగా ఉన్న వరుస కుర్చీల్లో కూర్చున్నారు. అయితే ఆకాష్, ఆయన తండ్రి ఆనంద్ మాయావతికి దగ్గరగా ఒక సోఫాలో కూర్చున్నారు. ఈ సమావేశంలో యువ నాయకుడికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని మాయావతి రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

2014 తర్వాత, బహుజన్ సమాజ్ పార్టీలో వలసల దశ మొదలైంది. బ్రజేష్ పాఠక్, స్వామి ప్రసాద్ మౌర్య, రామ్ అచల్ రాజ్‌భర్, లాల్జీ వర్మ, ఇంద్రజిత్ సరోజ్, నసిముద్దీన్ సిద్ధిఖీ, నకుల్ దూబే, బ్రిజ్‌లాల్ ఖబ్రీ వంటి ప్రముఖ నాయకులు పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. 2007 ఎన్నికల్లో బీఎస్పీకి పూర్తి మెజారిటీ రావడంలో ఈ నేతలంతా పెద్దన్న పాత్ర పోషించారు. యూపీ రాజకీయాల్లో ఈ నేతలు ఇప్పటికీ ప్రాంతీయ సత్రాలుగానే పరిగణించబడుతున్నారు. ఈ నేతలు వెళ్లిపోయిన తర్వాత ఇప్పుడు బీఎస్పీలో కిందిస్థాయి నేతల కొరత ఏర్పడింది.

CM Jagan Says Thanks to PM Modi : మోదీకి జగన్ ధన్యవాదాలు

రామ్‌జీ గౌతమ్, సతీష్ చంద్ర మిశ్రా, ముంకద్ అలీ మాత్రమే ఇప్పటికీ పార్టీలో ఉన్న పాత నాయకులు. సతీష్ మిశ్రా వ్యూహకర్తగా గుర్తింపు పొందారు. పార్టీలో తొక్కిసలాట తర్వాత బీఎస్పీలో పెద్ద శూన్యత ఏర్పడిందని, దానిని భర్తీ చేసేందుకు ఆకాష్‌ను మాయావతి ముందుకు తీసుకొస్తున్నారని చెబుతున్నారు. ఆకాష్‌కు ఇటీవలే 4 రాష్ట్రాల (మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ) ఇన్‌ఛార్జ్ నాలుగు ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. బీఎస్పీ చరిత్రలో తొలిసారిగా ఈ 4 రాష్ట్రాలకు ఏకకాలంలో ఓ నేతకు బాధ్యతలు అప్పగించారు.

Vladimir Putin: జీ-20 సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ రావడం లేదట

కాన్షీరామ్ హయాంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బీఎస్పీకి బలమైన మాస్ బేస్ ఉంది. ఈ రాష్ట్రాల్లో 2023 ఎన్నికల్లో బీఎస్పీ మంచి పనితీరు కనబరిస్తే.. ఆ క్రెడిట్ నేరుగా ఆకాష్ కే దక్కుతుంది. మాయావతి ప్రయత్నం కూడా అదే అంటున్నారు నిపుణులు. 4 రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లకు నేరుగా రిపోర్ట్ చేస్తున్న మాయావతి తర్వాత బీఎస్పీలో ఆకాష్ మాత్రమే నాయకుడు. ఆకాష్ రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ర్యాలీలు చేస్తున్నారు. ఇక రాజస్థాన్ రాష్ట్రంలో సంకల్ప్ యాత్ర ద్వారా నేరుగా కార్యకర్తలను కలుస్తున్నారు. తొలిసారిగా బీఎస్పీలో ఇలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఒక నాయకుడు యాత్ర చేస్తున్నారు.

NRI Application : కాంగ్రెస్ టికెట్ కోసం ఎన్నారైలు దరఖాస్తు.. ఏడు స్థానాల నుంచి ఎనిమిది మంది

2017లో మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనంద్ మొదటిసారి తెరపైకి వచ్చారు. మాయావతి తమ్ముడు ఆనంద్ కుమారుడు ఆకాష్. ఆయన లండన్‌లో ఎంబీఏ చదివారు. చదువు పూర్తయ్యాక వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన ఆకాష్ 2017లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సహరాన్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో మాయావతి ఆకాష్‌ను పార్టీ నేతలకు, కార్యకర్తలకు పరిచయం చేశారు. అనంతరమే పార్టీలో కీలక పదవి ఇచ్చారు. నేషనల్ కోర్డినేటర్ పదవితో జాతీయ స్థాయిలో పదవి ఇచ్చారు. ఇది పార్టీలో మూడవ అతిపెద్ద పదవి. అప్పటి నుంచి మాయావతి తర్వాత పార్టీలో కీలకంగా ఉంటూ వస్తున్నారు. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా పార్టీ చీఫ్ ఎవరేదానిపై పెద్ద ఎత్తున్నే చర్చ జరిగింది. అప్పుడు కూడా దీనిపై పార్టీ స్పష్టమైన సమాధానం చెప్పలేదు. 2022 ఎన్నికల్లో ఆకాష్ సలహా మేరకే మాయావతి మాఫియాకు దూరంగా ఉన్నట్లు ప్రకటించారు. యువతకు 50 శాతం భాగస్వామ్యం కల్పించాలని మాయావతి అన్నారు.