MLA Angad Kanhar : 58 ఏళ్ల వయస్సులో పదో తరగతి పరీక్ష రాసిన ఎమ్మెల్యే

58 ఏళ్ల వయస్సులో పదో తరగతి పరీక్ష రాశారు ఓ ఎమ్మెల్యే.

MLA Angad Kanhar : 58 ఏళ్ల వయస్సులో పదో తరగతి పరీక్ష రాసిన ఎమ్మెల్యే

Odisha Bjd Mla Angad Kanhar 10th Class Exam (1)

Odisha BJD MLA Angad Kanhar 10th class Exam : పదో తరగతి విద్యార్థులతో కలసి బోర్డు పరీక్షలు రాశారు ఓ ఎమ్మెల్యే. 58 ఏళ్ల వయసులో పరీక్షలకు హాజరై చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు. ఒడిశాలో 10వ తరగతి పరీక్షలు జరిగాయి. ఈ క్రమంలో కంధమాల్​ జిల్లాకు చెందిన బీజేడీ ఎమ్మెల్యే అంగాడ కన్హర్ శుక్రవారం (ఏప్రిల్ 29,2022) 10వ తరగతి పరీక్ష రాశారు.5.8 లక్షల మంది విద్యార్ధులతో పాటు ఎమ్మెల్యే కూడా పరీక్ష హాల్లో కూర్చుని బోర్డు పరీక్ష రాశారు.మధ్యలోనే చదువు ఆపేసిన చాలా మందికి ఒక స్ఫూర్తిగా నిలిచారు ఎమ్మెల్యే.

జిల్లాలోని ఫుల్బాని నియోజకవర్గ ఎమ్మెల్యే అంగాడ కన్హార్​ మధ్యలోనే చదువు ఆపేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో రాణించినా పదో తరగతి పూర్తి చేయాలని తపనపడేవారు. ఈ క్రమంలో బోర్డు ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​(బీఎస్​ఈ) నిర్వహిస్తోన్న హైస్కూల్​ వార్షిక పరీక్షలకు హాజరయ్యారు. కంధమాల్ జిల్లాలోని పితాబరి గ్రామంలో రుంజంగీ స్కూల్ లో పరీక్ష రాశారు. ఆయన హాజరైన పరీక్ష కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పదో తరగతి పరీక్షలకు హాజరై వార్తల్లో నిలిచారు ఎమ్మెల్యే .శుక్రవారం ప్రారంభమైన బోర్డు పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5.8 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 3,540 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. వారితో పాటు 9378 మంది ఓపెన్​ స్కూల్​, 4443 మంది మాధ్యమ పరీక్షల రాశారు. మే 6 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.