Chinese Visas: భారతీయ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రెండేళ్ల తర్వాత భారతీయ విద్యార్థులకు చైనా వీసా

రెండేళ్లుగా వీసాల కోసం ఎదురు చూస్తున్న భారతీయ విద్యార్థులకు చైనా గుడ్‌న్యూస్ చెప్పింది. దాదాపు 1,300కు పైగా విద్యార్థులకు వీసాలు మంజూరు చేసినట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే, వీసాలు కావాల్సిన విద్యార్థులు ఇంకా వేలల్లోనే ఉన్నారు.

Chinese Visas: భారతీయ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రెండేళ్ల తర్వాత భారతీయ విద్యార్థులకు చైనా వీసా

Chinese Visas: రెండేళ్లుగా వీసాల కోసం ఎదురు చూస్తున్న భారతీయ విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది చైనా. దాదాపు 1,300 మందికిపైగా భారతీయ విద్యార్థులకు వీసాలు మంజూరు చేసినట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. 2020లో కోవిడ్ ఎంతటి ప్రభావాన్ని చూపిందో తెలిసిందే.

Leopard Cub: ఫిలిం సిటీలో చిరుత పిల్ల.. తరిమిన కుక్కలు.. పట్టుకుని అధికారులకు అప్పగించిన గార్డ్స్

ఆ సమయంలో చైనాలో చదువుకుంటున్న వేలాదిమంది భారతీయులు ఇండియా తిరిగొచ్చారు. చదువు మధ్యలోనే ఆపేసి, దేశానికి తిరిగొచ్చారు. ఆ సమయంలో అక్కడ అన్ని విద్యా సంస్థల్ని మూసేశారు. అయితే, గతంతో పోలిస్తే చైనాలో ప్రస్తుతం పరిస్థితులు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. అలాగే విద్యాసంస్థలు ఎప్పట్లానే కొనసాగుతున్నాయి. దీంతో చైనా నుంచి తిరిగొచ్చిన విద్యార్థులు.. తిరిగి చైనా వెళ్లాలనుకుంటున్నారు. కానీ, చైనా రెండేళ్లుగా వీసాలు మంజూరు చేయడం లేదు. ముఖ్యంగా భారతీయ విద్యార్థుల్ని అనుమతించడంలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా అనేకసార్లు ఈ విషయాన్ని చైనా దృష్టికి తీసుకెళ్లింది.

BiggBoss 6 Day 37 : మళ్లీ రెచ్చిపోయిన గీతూ.. కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆడుకున్న బిగ్‌బాస్‌..

అయినా, చైనా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. తాజాగా 1,300 మంది విద్యార్థులకు వీసాలు మంజూరు చేసింది. చైనాలో భారతీయులు ఎక్కువగా వైద్య విద్య చదువుకుంటారు. ప్రస్తుతం ఉన్న నివేదికల ప్రకారం.. దాదాపు 23,000 మంది భారతీయ విద్యార్థులు చైనా యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు. మిగతా వారికి వీసాలు ఎప్పుడు మంజూరు చేస్తారు అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.