సిగ్గుపడాల్సింది నువ్వే రాహుల్

  • Published By: venkaiahnaidu ,Published On : May 13, 2019 / 01:25 PM IST
సిగ్గుపడాల్సింది నువ్వే రాహుల్

1984 సిక్కు అల్లర్ల గురించి కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ ఇంచార్జ్ శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు అని,తన వ్యాఖ్యలకు గాను పిట్రోడా దేశానికి క్షమాపణ చెప్పాలని,ఆయన తన వ్యాఖ్యలకు సిగ్గుపడాలని ఇవాళ(మే-13,2019)కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందించారు.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పంజాబ్ లోని భతిండాలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ వ్యాఖ్యలపై మోడీ మాట్లాడుతూ….మీరు మీ మెంటార్ ను తిడుతున్నట్లుగా నటించారు దేనికొరకు?ఎందుకంటే కాంగ్రెస్ హార్ట్ లో ఎప్పుడూ ఉండిందే ఆయన బహిరంగంగా చెప్పారని.సిగ్గుపడాల్సింది రాహుల్ గాంధీయేనని మోడీ అన్నారు.సిక్కుల ఉచకోతకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ ఇంచార్జ్ అయిన శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యల పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే.1984 లో జరిగిన సిక్కుల ఉచకోత ఆదేశాలు అప్పటి ప్రధానిగాఉన్న రాజీవ్ గాంధీ కార్యాలయం నుండే వచ్చాయని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఓ ప్రయివేట్ చానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో శ్యామ్ పింట్రోడా మట్లాడుతూ… అప్పుడేం జరిగింది? ఆ విషయాన్ని పక్కనబెట్టి ఈ ఐదేళ్లలో ఏం జరిగిందో దాని గురించి మాట్లాడండి. 1984లో జరిగిందేదో జరిగిపోయింది. అయితే ఇప్పుడేంటి?అని మాట్లాడారు.