రాహుల్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా..మోడీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా సోకడంపై ప్రధాని మోడీ స్పందించారు.
PM Modi కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా సోకడంపై ప్రధాని మోడీ స్పందించారు. లోక్సభ ఎంపీ రాహుల్ గాంధీ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నా అంటూ మంగళవారం మధ్యాహ్నాం మోడీ ట్వీట్ చేశారు. ఇక,రాహుల్ గాంధీ త్వరగా కోలుకోవాలని,ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు సహా వివిధ పార్టీలకు చెందిన నేతలు ట్వీట్ లు చేశారు.
కాగా, స్వల్ప లక్షణాలు కనిపించడంతో కొవిడ్ పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్ గా తేలినట్లు మంగళవారం రాహుల్ గాంధీ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇటీవల తనను కలిసినవారు కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించాలని, సురక్షితంగా, క్షేమంగా ఉండాలని పేర్కొన్నారు.
ఇటీవల దేశంలో పలువురు కీలకనేతలకు కొవిడ్ సోకుతున్న విషయం తెలిసిందే. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో కీలక నేత ఆనంద్శర్మ,కర్ణాటక సీఎం యడియూరప్ప, తెలంగాణ సీఎం కేసీఆర్ తదితరులకు తాజాగా కొవిడ్ బారినపడ్డారు.
I pray for the good health and quick recovery of Lok Sabha MP Shri @RahulGandhi Ji.
— Narendra Modi (@narendramodi) April 20, 2021
Wishing @RahulGandhi ji a speedy recovery from COVID-19. I pray for his good health.
— N Chandrababu Naidu (@ncbn) April 20, 2021