ఇది కొత్త భారత్…ఉగ్ర క్యాంపుల్లోకి వెళ్లి వాటిని నాశనం చేస్తుంది

  • Published By: venkaiahnaidu ,Published On : April 25, 2019 / 07:29 AM IST
ఇది కొత్త భారత్…ఉగ్ర క్యాంపుల్లోకి వెళ్లి వాటిని నాశనం చేస్తుంది

విపక్షాలపై ప్రధాని మోడీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొంతమందికి దేశ భద్రత పెద్ద విషయంగా కనిపించడం లేదని విపక్షాలపై పరోక్షంగా మోడీ విమర్శలు గుప్పించారు.మోడీ ఎందుకు ఉగ్రవాదం గురించి మాట్లాడుతున్నాడు..ఇది పెద్ద ఇష్యూ కాదు అంటూ కొంతమంది మాట్లాడుతున్నారని కానీ కొత్త ఇండియాలో దేశ భద్రత చాలా పెద్ద ఇష్యూ అని మోడీ సృష్టం చేశారు.
Also Read : పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లోనే : గంటకు మించి ఫోన్లు ఇస్తే రిస్క్

ఇది సరికొత్త భారత్ అని, ఉగ్రశిబిరాల్లోకి వెళ్లి వాటిని నాశనం చేస్తుందని మోడీ అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(ఏప్రిల్-25,2019)బీహార్ లోని దర్బాంగాలో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.  

మనదేశంలో నివసించే కొంతమందికి భారత్ మాతా కీ,వందే మాతరం నినాదాలతో ప్రాబ్లమ్ ఉందని మోడీ అన్నారు.అలాంటివాళ్లు డిపాజిట్లు కోల్పోవాలా, వద్దా అని ర్యాలీకి హాజరైన ప్రజలనుద్దేశించి మోడీ ప్రశ్నించారు.తాను భారత్ గురించి మాట్లాడినప్పుడల్లా ఇలాంటి వ్యక్తులు కంప్లెయింట్స్ చేస్తారని మోడీ విమర్శించారు.
Also Read : తూచ్ : ప్రియాంక కాదు.. వారణాసిలో మోడీపై పోటీగా ఎవరంటే?