Bihar: బిహార్‌లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు.. రూ.4 కోట్ల నగదు స్వాధీనం

అక్రమాలకు పాల్పడ్డ అధికారుల ఇండ్ల నుంచి బిహార్ విజిలెన్స్ అధికారులు రూ.4 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (వీఐబీ) అధికారులు శనివారం ఈ దాడులు నిర్వహించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.

Bihar: బిహార్‌లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు.. రూ.4 కోట్ల నగదు స్వాధీనం

Bihar: బిహార్‌లో ముగ్గురు ప్రభుత్వ అధికారుల ఇండ్లు, కార్యాలయాలపై విజిలెన్స్ అధికారులు జరిపిన దాడిలో రూ.4 కోట్లకుపైగా నగదు లభ్యమైంది. కిషన్ గంజ్ డివిజన్‌కు చెందిన పబ్లిక్స్ వర్క్ డిపార్ట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిన సంజయ్ కుమార్ రాయ్ అక్రమాలకు పాల్పడ్డాడన్న సమాచారం మేరకు విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (వీఐబీ) అధికారులు శనివారం దాడులు నిర్వహించారు.

Brahmastra Pre Release Event : బాలీవుడ్ బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా టాలీవుడ్ స్టార్.. మాములుగా లేదుగా మన క్రేజ్..

పాట్నా, కిషన్ గంజ్‌లోని అనేక ప్రాంతాల్లో ఒకేసారి ఈ దాడులు నిర్వహించారు. సంజయ్ కుమార్ లంచంగా స్వీకరించిన నగదును అతడి కింది ఉద్యోగుల వద్ద కూడా దాచాడు. దీంతో ఈ సమాచారం మేరకు అతడితోపాటు, అతడి వద్ద పనిచేసే జూనియర్ ఇంజినీర్, క్యాషియర్ వద్ద తనిఖీలు నిర్వహించారు. మొత్తం ముగ్గురి నివాసాల్లో ఒకేసారి సోదాలు చేయగా, సంజయ్ క్యాషియర్ ఇంట్లో రూ.3 కోట్ల నగదు, సంజయ్ ఇంట్లో రూ.1కోటికిపైగా నగదు లభించింది.

Bandi Sanjay Praja Sangrama Yatra End : ముగిసిన బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర

ఇంకా పలుచోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. నగదు లెక్కించే మెషీన్లతో దొరికిన డబ్బును అధికారులు లెక్కిస్తున్నారు. ఈ డబ్బు సీజ్ చేసి, వారిపై కేసు నమోదు చేస్తారు.