Teen Kill Parents: 37 ఏళ్ల ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు తల్లిదండ్రులను హత్య చేసిన పదిహేనేళ్ల కూతురు

ఝార్ఖండ్‌లో దారుణం జరిగింది. 37 ఏళ్ల వయసున్న ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించిందో పదిహేనేళ్ల అమ్మాయి. పెళ్లి కోసం ఇంట్లో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా తల్లిదండ్రులు అడ్డుకున్నారు. దీంతో వారిని దారుణంగా చంపేసింది.

Teen Kill Parents: 37 ఏళ్ల ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు తల్లిదండ్రులను హత్య చేసిన పదిహేనేళ్ల కూతురు

Teen Kill Parents: ప్రేమ మత్తులో విచక్షణ మరిచిన కూతురు తల్లిదండ్రులనే హతమార్చింది. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్, మనిఫిట్ టెల్కో పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. 15 ఏళ్ల బాలిక కొంతకాలంగా 37 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తిని ప్రేమిస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

Rajasthan: 70 ఏళ్ల వయసులో తల్లైన మహిళ.. పెళ్లైన 54 ఏళ్లకు తల్లిదండ్రులుగా మారిన జంట

ఇందుకోసం గత ఆదివారం రాత్రి బాలిక ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రులు నిద్రపోయిన తర్వాత అర్థరాత్రి ఇంట్లోనుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో శబ్దం వినిపించడంతో తల్లిదండ్రులు నిద్ర నుంచి లేచారు. తమ కూతురు బయటకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తుండటం చూసి, ప్రశ్నించారు. తన ప్రేమ విషయం చెప్పి, అతడిని పెళ్లి చేసుకునేందుకు వెళ్తున్నానని చెప్పింది. దీంతో షాక్ తిన్న తల్లిదండ్రులు తమ కూతురుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బాలికను ఇంటి నుంచి వెళ్లకుండా అడ్డుకున్నారు. తనను అడ్డుకోవంతో కోపం తెచ్చుకున్న బాలిక తల్లిదండ్రులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఇంట్లో ఉన్న సుత్తితోపాటు, ప్రెషర్ కుక్కర్‌తో తల్లిదండ్రుల తలపై కొట్టింది.

Meena : భర్త చనిపోయాక మొదటిసారి.. అలనాటి తారలతో కలిసి మీనా ఇలా..

దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రక్తపు మడుగులో పడి, ప్రాణాలు పోగొట్టుకున్న తల్లిదండ్రుల్ని అలాగే వదిలేసి అదే రాత్రిపూట ప్రియుడితో కలిసి స్కూట‌ర్‌పై వెళ్లిపోయింది. అతడి ఇంటికి చేరుకుని అక్కడే ఉన్నారిద్దరూ. మరుసటి రోజు ఇంటి గేటు తెరిచి ఉండటంతో స్థానికులు లోపలికి వెళ్లి చూశారు. అక్కడ దంపతులిద్దరూ ప్రాణాలు కోల్పోయి, రక్తపు మడుగులో కనిపించారు. వెంటనే చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. భార్యాభర్తలిద్దరూ రక్తపు మడుగులో చనిపోయి ఉండటం.. కూతురు కనిపించకపోవడంతో ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు జరిపారు.

Koffee with Karan : మీ అన్న నీ ఫ్రెండ్స్ ఎంతమందితో బెడ్ షేర్ చేసుకున్నాడు.. అన్నా చెల్లిల్లని కూడా వదలని కరణ్ జోహార్..

బాలికను, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం తెలిసింది. ఇద్దరిపై మర్డర్ కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.