Jammu And Kashmir: టెర్రరిస్టు కాల్పుల్లో మహిళా టీచర్ మృతి
జమ్మూ అండ్ కశ్మీర్ లో జరిగిన మరోసారి కాల్పుల్లో.. ఓ స్కూల్ టీచర్ మృతి చెందారు. కశ్మీర్ ప్రాంతంలోని కుల్గం జిల్లాలో ఈ ఉగ్రదాడి జరిగింది. 36 సంవత్సరాల వయస్సున్న రజనీ బాలా.. జమ్మూ ప్రాంతంలో ఉండేవారు. కాల్పుల్లో తీవ్రగాయాలకు గురికావడంతో హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Jammu And Kashmir: జమ్మూ అండ్ కశ్మీర్ లో జరిగిన మరోసారి కాల్పుల్లో.. ఓ స్కూల్ టీచర్ మృతి చెందారు. కశ్మీర్ ప్రాంతంలోని కుల్గం జిల్లాలో ఈ ఉగ్రదాడి జరిగింది. 36 సంవత్సరాల వయస్సున్న రజనీ బాలా.. జమ్మూ ప్రాంతంలో ఉండేవారు. కాల్పుల్లో తీవ్రగాయాలకు గురికావడంతో హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కుల్గంలోని గోపాల్పురా ప్రాంతంలో ఉన్న హైస్కూల్ లో ఘటన జరిగినట్లు సమాచారం. నేషనల్ కాన్ఫిరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. నీచమైన చర్యగా అభివర్ణించారు.
“బాధితురాలు రజనీ జమ్మూ ప్రావిన్స్లోని సాంబా జిల్లాకు చెందినవారిగా గుర్తించాం. దక్షిణ కశ్మీర్లోని కుల్గామ్ ప్రాంతంలో తుచ్ఛమైన లక్ష్యంతో జరిగిన దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. మరో కుటుంబం ఉగ్రదాడి కారణంగా విషాదంలోకి వెళ్లిపోయింది. నిరాయుధ పౌరులను లక్ష్యంగా చేసుకుని ఇటీవలి దాడులకు సంబంధించిన సుదీర్ఘ జాబితాలో ఇది మరొక హత్య. పరిస్థితులు మూమూలయ్యేంత వరకూ తాము విశ్రమించబోమని ప్రభుత్వం హామీ ఇచ్చింది” అని Mr అబ్దుల్లా వెల్లడించారు.
Read Also: తీవ్రవాదుల దాడిలో కశ్మీర్ పండిట్ మృతి
కుల్గామ్లో హిందూ అధ్యాపకుడు కాల్చివేత కశ్మీర్లో హిందువులపై దాడికి పాల్పడిన రజనీ భల్లా కుల్గామ్లో కాల్చి చంపేశారు.
ఇటీవల, సెంట్రల్ కాశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి రాహుల్ భట్ను అతని కార్యాలయంలో ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఆ ప్రాంతంలో భారీ నిరసనలు చెలరేగాయి. భట్ మూడు వారాల క్రితం చాదూరా పట్టణంలోని తహసీల్ కార్యాలయంలో ఉగ్రవాదులు చేతిలో హతమయ్యారు. అతను 2010-11లో వలసదారుల కోసం ప్రత్యేక ఉపాధి ప్యాకేజీ కింద పొందిన క్లర్క్ ఉద్యోగం చేసేవాడు.
మే నెలలో కశ్మీర్లో జరిగిన ఏడో టార్గెట్ హత్య ఇది. బాధితుల్లో ముగ్గురు డ్యూటీ లేని పోలీసులు కాగా, మిగిలిన నలుగురు సాధారణ పౌరులు.