Redmi Smart TV: ఈ నెలలోనే విడుదల.. అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే..
జియోమీ తన సబ్ బ్రాండ్ రెడ్మీ ని ఇండియాలో విస్తరించాలని చూస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్ టీవీ తెస్తోంది. త్వరలోనే స్మార్ట్ టీవీ మోడల్స్ను లాంచ్ చేయనున్నట్టు జియోమీ ప్రకటిం
Redmi Smart TV: జియోమీ తన సబ్ బ్రాండ్ రెడ్మీ ని ఇండియాలో విస్తరించాలని చూస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్ టీవీ తెస్తోంది. త్వరలోనే స్మార్ట్ టీవీ మోడల్స్ను లాంచ్ చేయనున్నట్టు జియోమీ ప్రకటించింది. సెప్టెంబర్ 22న ఇండియాలో స్మార్ట్ టీవీ సిరీస్ను రెడ్మీ లాంచ్ చేయనుంది. స్మార్ట్ టీవీ డిజైన్, ఫీచర్లను కూడా రెడ్మీ ప్రకటించింది. 32, 43 ఇంచ్ సైజ్లో రానున్న స్మార్ట్ టీవీలో సరికొత్త ఫీచర్లు ఉండనున్నాయి.
Google Pay: అనుమానస్పదంగా మారిన గూగుల్ పే ప్రైవసీ
* డాల్బీ ఆడియో
* డీటీఎస్ వర్చువల్ ఎక్స్ ఫార్మాట్తో 20 వాట్స్ ఆడియో ఔట్పుట్
* వివిడ్ పిక్చర్ ఇంజన్(వీపీఈ)
* జియోమీ ఇన్ హౌస్ ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ
* ఆండ్రాయిడ్ 11 ఆధారిత ప్యాచ్వాల్ 4
* బ్లూటూత్ వీ5.0
* డ్యుయల్ బాండ్ వైఫై
* ఆటో లేటెన్సీ మోడ్ లాంటి బెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ టీవీ సిరీస్ రిలీజ్ కానుంది.
Horror మూవీలను భయపడకుండా చూస్తే.. ఈ కంపెనీ రూ. 95,500 చెల్లిస్తానంటోంది!
రెడ్మీ ఇప్పటికే స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్ పేరుతో స్మార్ట్ టీవీలను రిలీజ్ చేసింది. ఎంఐ కూడా బ్రాండ్ నుంచి స్మార్ట్ టీవీలు ఇండియాలో రిలీజ్ అవుతుంటాయి. ఇక.. రెడ్మీ నుంచి లాంచ్ కానున్న ఈ టీవీల ధర కూడా తక్కువగానే ఉండనుందట. రూ.30 వేల రేంజ్లోనే ఈ టీవీలను అమ్మనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రెడ్మీ టీవీలలో 32, 43 ఇంచ్ స్మార్ట్ టీవీల ధరలు.. రూ.15 వేల నుంచి రూ.30 వేల లోపే ఉన్నాయి.
కాగా, తన ప్రీమియం రేంజ్ డివైజ్ ల(స్మార్ట్ ఫోన్లు, టీవీలు) పై బ్రాండ్ పేరు మారుస్తున్నట్టు జియోమీ ప్రకటించింది. ఇకపై ఎంఐ సిరీస్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ మీద ఎంఐ లోగో బదులు కేవలం జియోమీ లోగో మాత్రమే ఉంటుంది. కాగా, రెడ్మీ ద్వారా వచ్చే ప్రొడక్ట్స్ పేరులో మాత్రం ఎటువంటి మార్పులు లేవు. కేవలం ఎంఐ బ్రాండ్ పేరును తొలగించి.. జియోమీ పేరునే లోగోగా ఇక నుంచి ఉపయోగించనున్నారు.
గత నెలలో జియోమీ రెండు ల్యాప్ ట్యాప్ లు లాంచ్ చేసింది. రెడ్ మీ బ్రాండ్ కింద విడుదల చేసింది. రెడ్ మీ బుక్ 15 ప్రో, రెడ్ మీ బుక్ 15 ఈ లర్నింగ్ ఎడిషన్ పేర్లతో ల్యాప్ ట్యాప్ లు లాంచ్ చేసింది.
రెడ్ మీ బుక్ 15 ప్రో ధర రూ.49వేల 999. 8GB RAM + 512GB స్టోరేజ్ ఆప్షన్. రెడ్ మీ బుక్ 15 ఈ లర్నింగ్ ఎడిషన్ లో రెండు వేరియంట్లు లాంచ్ చేశారు. అందులో 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.41,999. 8జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.44వేల 999.