India vs England Semi Final Match: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్.. ఫొటో గ్యాలరీ
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో భాగంగా గురువారం ఆడిలైడ్లో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ జట్లు తలపడ్డాయి. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్దేశిత 20ఓవర్లకు ఆరు వికెట్లు నష్టపోయి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించింది. ఆ జట్టు ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (86), కెప్టెన్ జోస్ బట్లర్ (80) రాణించడంతో టీమిండియాకు ఘోర పరాభవం తప్పలేదు. ఇండియాపై ఘన విజయం సాధించి ఫైనల్ కు చేరిన ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే ఫైనల్కు చేరిన పాకిస్థాన్ జట్టుతో ఆదివారం తలపడనుంది.