The Ghost: సంధ్య 35ఎంఎం థియేటర్లో సందడి చేసిన ది ఘోస్ట్ టీమ్!
అక్కినేని నాగార్జున నటించిన తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ దసరా కానుకగా నేడు మంచి అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు ప్రేక్షకాదరణ ఎలా ఉందో తెలుసుకునేందుకు చిత్ర టీమ్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య 35ఎంఎం థియేటర్కు వెళ్లి, ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు, అందాల భామ సోనాల్ చౌహాన్లతో పాటు చిత్ర టీమ్ సభ్యులు మరికొంత మంది అక్కడ సందడి చేశారు.