Tirumala : రేపు జులై నెల ప్రత్యేక దర్శనం కోటా టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి ఆలయంలో, జులై నెలలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు రూ.300/- ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ రేపు(జూన్ 22న) ఉదయం విడుదల చేస్తుంది.
Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో, జులై నెలలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు రూ.300/- ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ రేపు(జూన్ 22న) ఉదయం విడుదల చేస్తుంది. ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్లైన్లో టికెట్లు విడుదల చేయనుంది. రోజుకు 5 వేల చొప్పున టికెట్లను విడుదల చేస్తారు.
కాగా, జులై నెలకు సంబంధించిన గదుల కోటాను జూన్ 23న బుధవారం ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.