Virat Kohli: ఆధ్యాత్మిక బాటలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. రిషికేష్ ఆశ్రమంలో సేదతీరుతున్న జంట
అనుష్క-కోహ్లీ జంట తరచూ ఆధ్యాత్మిక యాత్రలు చేస్తుంటారు. ఇద్దరూ వృత్తిపరంగా ఎప్పుడూ బిజీగా ఉంటారు. కోహ్లీ క్రికెటర్గా జాతీయ జట్టుకు ఆడుతూ ఉంటే, అనుష్క శర్మ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఇద్దరికీ విశ్రాంతి సమయం దొరికేది చాలా తక్కువ.
Virat Kohli: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఆధ్యాత్మిక యాత్రలో సేదతీరుతున్నారు. తాజాగా ఈ జంట రిషికేష్లోని స్వామి దయానంద్ గిరి ఆశ్రమంలో గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు తాజాగా విడుదలయ్యాయి.
Gautam Adani: ప్రపంచ బిలియనీర్ల జాబితాలో టాప్-10 నుంచి గౌతమ్ అదానీ ఔట్ ..
అనుష్క-కోహ్లీ జంట తరచూ ఆధ్యాత్మిక యాత్రలు చేస్తుంటారు. ఇద్దరూ వృత్తిపరంగా ఎప్పుడూ బిజీగా ఉంటారు. కోహ్లీ క్రికెటర్గా జాతీయ జట్టుకు ఆడుతూ ఉంటే, అనుష్క శర్మ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఇద్దరికీ విశ్రాంతి సమయం దొరికేది చాలా తక్కువ. విశ్రాంతి దొరికితే అప్పుడప్పుడూ ఆధ్యాత్మిక యాత్రలు చేస్తుంటారు. తమ కూతురు వామికాను కూడా వెంట తీసుకెళ్తారు. అయితే, తాజా రిషికేష్ యాత్రలో వామికా కూడా వారి వెంట ఉందా.. లేదా అనే విషయంలో స్పష్టత లేదు. రిషికేష్లో అనుష్క-కోహ్లీ చాలా సరదాగా గడిపినట్లు తెలుస్తోంది. ఆశ్రమంలో సాదాసీదాగా మెలిగారు. అక్కడి వాళ్లతో సెల్ఫీలు దిగారు.
కొద్దిరోజుల క్రితం కూడా ఇద్దరూ వృందావనంలో గడిపారు. బాబా నీమ్ కరోలి ఆశ్రమంలో గడిపారు. ఆశ్రమంలో ధ్యానం చేస్తూ ప్రశాంతత పొందారు. అక్కడి వారికి బ్లాంకెట్లు పంపిణీ చేశారు. త్వరలో ఆస్ట్రేలియాతో ఇండియా టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ లోపే విరాట్ ఆధ్యాత్మిక యాత్ర పూర్తి చేసుకుని మానసికంగా ధృడంగా తయారయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. విరాట్-కోహ్లీ 2017లో పెళ్లి చేసుకున్నారు. వీరికి జనవరి 11, 2021న కూతురు జన్మించింది.