Asia Cup 2022 : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. విరాట్ కోహ్లి విశ్వరూపం.. వెయ్యి రోజుల తర్వాత సెంచరీ

ఆసియా కప్ టీ20 టోర్నీలో అప్ఘానిస్తాన్ తో మ్యాచ్ లో విరాట్ కోహ్లి విశ్వరూపం చూపించాడు. అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పరుగుల వరద పారించిన విరాట్.. ఈ క్రమంలో సెంచరీ బాదాడు.

Asia Cup 2022 : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. విరాట్ కోహ్లి విశ్వరూపం.. వెయ్యి రోజుల తర్వాత సెంచరీ

Asia Cup 2022 : ఆసియా కప్ టీ20 టోర్నీ సూపర్ 4లో భాగంగా అప్ఘానిస్తాన్ తో మ్యాచ్ లో విరాట్ కోహ్లి విశ్వరూపం చూపించాడు. అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పరుగుల వరద పారించిన విరాట్.. ఈ క్రమంలో సూపర్ సెంచరీ చేశాడు. 53 బంతుల్లోనే విరాట్ కోహ్లి శతకం సాధించడం విశేషం. అతడి స్కోర్ లో 11 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. విరాట్ కోహ్లి చెలరేగడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. చివరి వరకు అజేయంగా క్రీజ్ లో ఉన్న విరాట్.. 61 బంతుల్లో 122 పరుగులు చేశాడు. మొత్తం 12 ఫోర్లు, 6 సిక్సులు బాదాడు. కాగా, వెయ్యి రోజుల తర్వాత విరాట్ కోహ్లి ఎట్టకేలకు సెంచరీ చేశాడు. అలాగే టీ20ల్లో తొలి శతకం నమోదు చేశాడు.

మూడేళ్లుగా తనను పట్టి పీడిస్తున్న పరుగుల కరవుకు విరాట్ కోహ్లీ ఓ అద్భుత శతకంతో తెరదించాడు. అఫ్ఘాన్ తో మ్యాచ్ లో కోహ్లీ విశ్వరూపం ప్రదర్శించాడు. సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ భారీ సెంచరీ సాధించి అజేయంగా నిలిచాడు. ఓపెనర్ గా బరిలో దిగిన కోహ్లీ 61 బంతుల్లో 122 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ స్కోరులో 12 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయంటే ప్రత్యర్థి బౌలర్లను ఎంతలా బాదాడో అర్థమవుతుంది. 2019 తర్వాత కోహ్లీకి ఇదే మొదటి శతకం కావడంతో ఈ ఇన్నింగ్స్ కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది.

ఇక కోహ్లీ సూపర్ సెంచరీ సాయంతో టీమిండియా ఈ మ్యాచ్ లో భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 41 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 62 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో హైలెట్ అంటే కోహ్లీ ఆటే. మైదానంలో అన్ని వైపులకు బంతిని పంపిన కోహ్లీ ఓవరాల్ గా 71వ అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ (71)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు కోహ్లీ.

అంతేకాదు, అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీకిదే తొలి సెంచరీ. దాంతోపాటే, భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్ మన్ గానూ అవతరించాడు.

అంతేకాదు మరో ఈ సెంచరీతో మరో ఘనత సాధించాడు కోహ్లి. రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ లో 122* రన్స్ చేసి టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు విరాట్. ఇప్పటివరకు ఈ రికార్డ్ రోహిత్ పేరిట ఉండేది. రోహిత్ శర్మ 2017లో శ్రీలంకపై 118 పరుగులు చేశాడు.