PV Sindhu: సెమీస్లోకి సింధు.. యమగూచితో పోరాటం
సింధుకు.. నెస్లిహాన్ యిగిట్ (టర్కీ)కి మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కేవలం 35 నిమిషాల్లోనే ముగియగా.. సింధు 21-13, 21-10తో విజయం సాధించింది. ఈ టర్కీ ప్లేయర్తో గతంలో 4సార్లు..
PV Sindhu: ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సింధు సెమీస్ లోకి దూసుకెళ్లింది. మ్యాచ్ మొత్తం ఆధిపత్యం చెలాయిస్తూ ప్రత్యర్థికి అవకాశం లేకుండా చేసింది. సింధుకు.. నెస్లిహాన్ యిగిట్ (టర్కీ)కి మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కేవలం 35 నిమిషాల్లోనే ముగియగా.. సింధు 21-13, 21-10తో విజయం సాధించింది. ఈ టర్కీ ప్లేయర్తో గతంలో 4సార్లు తలపడిన సింధు ప్రతిసారీ విజయం దక్కించుకుంది.
పురుషుల సింగిల్స్లో భారత్కే చెందిన శ్రీకాంత్ కూడా సెమీఫైనల్ చేరాడు. శ్రీకాంత్ 21–7, 21–18తో సహచరుడు ప్రణయ్ను ఓడించాడు.
శనివారం జరిగే సెమీస్లో మాత్రం గట్టిపోటీ ఎదుర్కోకతప్పదు. జపాన్కు చెందిన టాప్ సీడ్ అకానె యమగుచి, ఐదో సీడ్ పోర్న్పావీ చోచువాంగ్ల మధ్య జరిగే మ్యాచ్ విజేతతో తలపడాల్సి ఉంది. ఇప్పటి వరకు అకానె యమగూచి 19 సార్లు తలపడగా.. 12 మ్యాచ్ల్లో సింధు పైచేయి సాధించింది. ఏడింట్లో ప్రత్యర్థి గెలిచింది.
………………………………………. : కదిరిలో కూలిన మూడంతస్తుల భవనం-ఇద్దరు చిన్నారుల మృతి
పురుషుల సింగిల్స్ సెమీస్లో మూడో సీడ్ ఆండర్స్ ఆంథోన్సెన్తో శ్రీకాంత్ పోటీపడతాడు. వీరిద్దరు 3 సార్లు తలపడగా.. ఒక మ్యాచ్లో శ్రీకాంత్, రెండింట్లో ప్రత్యర్థి పైచేయి సాధించారు. పురుషుల సింగిల్స్లో భారత్కే చెందిన శ్రీకాంత్ కూడా సెమీఫైనల్ చేరాడు. శ్రీకాంత్ 21–7, 21–18తో సహచరుడు ప్రణయ్ను ఓడించాడు.