Tokyo Olympics : బిగ్ బ్రేకింగ్, సెమీస్‌‌కు చేరుకున్న బాక్సర్ లవ్లీనా..భారత్‌‌కు మరో పతకం ఖాయం

భారతదేశానికి మరో మెడల్ దక్కనుంది. భారత బాక్సర్ లవ్లీనా సెమీస్ కు దూసుకెళ్లడం విశేషం. క్వార్టర్స్ లో చైనీస్ తైపీ బాక్సర్ పై లవ్లీనా విజయం సాధించారు. దీంతో బాక్సింగ్ లో పతకం ఖాయం అయ్యింది.

Tokyo Olympics : బిగ్ బ్రేకింగ్, సెమీస్‌‌కు చేరుకున్న బాక్సర్ లవ్లీనా..భారత్‌‌కు మరో పతకం ఖాయం

Lovlina Borgohain : ఒలింపిక్స్ క్రీడలు కొనసాగుతున్నాయి. భారతదేశానికి చెందిన పలువురు క్రీడాకారులు తమ ప్రతిభను చాటుతున్నారు. ఇప్పటికే వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకాన్ని మీరాబాయి చాను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా భారతదేశానికి మరో మెడల్ దక్కనుంది. భారత బాక్సర్ లవ్లీనా సెమీస్ కు దూసుకెళ్లడం విశేషం. క్వార్టర్స్ లో చైనీస్ తైపీ బాక్సర్ పై లవ్లీనా విజయం సాధించారు. దీంతో బాక్సింగ్ లో పతకం ఖాయమైంది. 69 కిలోల విభాగంలో తైపీ బాక్సర్ నీన్ చిన్ చెన్ పై 4-1 తేడాతో విజయం సాధించారు.

మరోవైపు..భారత మహిళా షూటర్లు రాణించలేకపోయారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ క్వాలిఫికేషన్ పోటీలు జరిగాయి. రౌండ్ లో 290 పాయింట్లతో మనుబాకర్ 15వ స్థానంలో…286 పాయింట్లతో సర్నబోత్ రహీ 32వ స్థానంలో నిలిచారు. దీంతో వీరిద్దరూ ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించలేకపోయారు.