India vs England: సెమీఫైనల్ మ్యాచులో ఓడిపోగానే రోహిత్ శర్మ కన్నీరు.. వీడియో

టీ20 ప్రపంచ కప్ లో భాగంగా అడిలైడ్ ఓవల్ లో ఇవాళ జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిపోవడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కన్నీరు పెట్టుకున్నాడు. ఇంగ్లండ్ కు టీమిండియా 169 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించగా, ఈ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా అలవోకగా ఛేదించిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ లో సెమీఫైనల్స్ ముందు వరకు అద్భుతంగా రాణించిన టీమిండియా ఇవాళ మాత్రం ఘోరంగా ఓడిపోవడంతో డగౌట్ లో రోహిత్ శర్మ కన్నీరు ఆపుకోలేకపోయాడు.

India vs England: సెమీఫైనల్ మ్యాచులో ఓడిపోగానే రోహిత్ శర్మ కన్నీరు.. వీడియో

India vs England: టీ20 ప్రపంచ కప్ లో భాగంగా అడిలైడ్ ఓవల్ లో ఇవాళ జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిపోవడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కన్నీరు పెట్టుకున్నాడు. ఇంగ్లండ్ కు టీమిండియా 169 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించగా, ఈ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా అలవోకగా ఛేదించిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ లో సెమీఫైనల్స్ ముందు వరకు అద్భుతంగా రాణించిన టీమిండియా ఇవాళ మాత్రం ఘోరంగా ఓడిపోవడంతో డగౌట్ లో రోహిత్ శర్మ కన్నీరు ఆపుకోలేకపోయాడు.

ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రోహిత్ శర్మ కన్నీరు పెట్టుకుంటుంటే చూడలేకపోతున్నామని పేర్కొంటూ టీమిండియా అభిమానులు ఇందుకు సంబంధించిన ఈ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.

రోహిత్ శర్మ కన్నీరు పెట్టుకున్న సమయంలో అతడి పక్కన టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఉన్నారు. రోహిత్ శర్మను ద్రవిడ్ ఓదార్చే ప్రయత్నం చేశారు. బ్యాటింగ్ లో ఫర్వాలేదనిపించిన టీమిండియా బౌలింగ్ లో మాత్రం చెత్త ప్రదర్శనతో అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..